బెంగుళూరులో ‘ఈ-ఖాటా’ విప్లవం- ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్!

బెంగుళూరులో ‘ఈ-ఖాటా విప్లవం’ ప్రారంభమైంది! ఇక ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్​లో జరగనుంది. ఫలితంగా మధ్యవర్తులకు చెక్ పడనుంది. అవినీతి, జాప్యాలకు చెక్ పెట్టేందుకే ఈ డిజిటల్​ సంస్కరణలు తీసుకొచ్చినట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు.

Published on: Nov 15, 2025, 12:30:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగుళూరు నగరంలో ఆస్తుల రికార్డుల వ్యవస్థను సమూలంగా మారుస్తూ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం ఒక కీలకమైన డిజిటల్ సంస్కరణను ప్రకటించారు. ఇది "ఈ-ఖాటా విప్లవానికి" నాంది పలుకుతుందని, దీని ద్వారా మధ్యవర్తులు లేకుండా పోతారని, అనుమతులు వేగవంతం అవుతాయని, అలాగే మొత్తం ఖాటా ప్రక్రియ పూర్తిగా ఫేస్‌లెస్, ఆన్‌లైన్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

బెంగళూరు ఆస్తి రికార్డు వ్యవస్థలో భారీ మార్పులు.. (Unsplash )
బెంగళూరు ఆస్తి రికార్డు వ్యవస్థలో భారీ మార్పులు.. (Unsplash )

ఎక్స్​ (ట్విట్టర్) వేదికగా శివకుమార్ పంచుకున్న పోస్ట్ ప్రకారం, నివాసితులు ఇకపై ఏ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే, బీబీఎంపీ ఈ-ఆస్తి పోర్టల్ ద్వారా లేదా బెంగుళూరు వన్ కేంద్రాల్లో డిజిటల్‌గా ఈ-ఖాటా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అవినీతి, జాప్యం, వేధింపులపై దీర్ఘకాలంగా ఉన్న ఫిర్యాదులకు ముగింపు పలకడమే ఈ చర్యకు ప్రధాన లక్ష్యమని డీకే శివకుమార్​ తెలిపారు.

ఈ- ఖాటా : పారదర్శకతకు పెద్ద పీట

ఇప్పటికే 25 లక్షల కంటే ఎక్కువ ఆస్తి రికార్డులను ఈ-ఆస్తి ప్లాట్‌ఫారమ్‌కు మైగ్రేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా పౌరులు తమ యాజమాన్య వివరాలు, మ్యుటేషన్ స్టేటస్​, పన్ను సమాచారాన్ని తక్షణమే తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన ప్రతి దరఖాస్తు ఇప్పుడు ఆటో-రూట్ ద్వారా అప్రూవల్​ డాష్‌బోర్డ్‌కు వెళుతుంది. తద్వారా పారదర్శకత, సమయ-పరిమితితో కూడిన ప్రాసెసింగ్‌కు హామీ లభిస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌తో బెంగుళూరు ఆస్తి పాలన "సరళంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా" మారుతుందని, ఇది పౌర-కేంద్రీకృత, పౌర పరిపాలన వైపు ఒక ముఖ్యమైన అడుగు అని శివకుమార్ అభివర్ణించారు.

బీ-ఖాటా నుంచి ఏ-ఖాటా రెగ్యులరైజేషన్

ఇదిలా ఉండగా, కర్ణాటక ప్రభుత్వం బీ-ఖాటా ప్లాట్లను ఏ-ఖాటా స్థలాలుగా మార్చడానికి, కొత్తగా అర్హత పొందిన ప్లాట్లకు ఏ-ఖాటాను జారీ చేయడానికి ఒక సరళీకృత, ఎండ్-టు-ఎండ్ ప్రక్రియను అమలు చేసిన తర్వాత, బెంగుళూరులోని బీ-ఖాటా స్థలాల యజమానులకు పెద్ద ఊరట లభించింది.

పథకం చట్టపరమైన యాజమాన్యాన్ని స్పష్టం చేయడం, ఆస్తి విలువలను పెంచడం, వేలాది ప్లాట్ల యజమానులకు రియల్ ఎస్టేట్ లావాదేవీలను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ పథకం ఫ్లాట్‌లకు స్పష్టంగా మినహాయింపునిచ్చి, వ్యక్తిగత ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే కన్వర్ట్ అయిన, ఇంకా కన్వర్ట్ చేయాల్సిన ప్లాట్లు రెండూ ఈ కొత్త సరళీకృత మార్గంలో అర్హత కలిగి ఉంటాయని అధికారులు తెలిపారు.

వేగవంతమైన ఆన్‌లైన్ ప్రక్రియ

అధికారులు ఒకే ప్లాట్‌కి సంబంధించిన ఫాస్ట్-ట్రాక్ అర్హతను 2,000 చదరపు మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు పరిమితం చేశారు. అలాగే, కార్యాలయ సందర్శనలను తగ్గించడానికి, మధ్యవర్తులను పరిమితం చేయడానికి ఎక్కువగా ఆన్‌లైన్ మార్గాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఆటోమేషన్, ఆధార్-అనుసంధాన ధృవీకరణ టైటిల్ వివాదాలను తగ్గిస్తుంది, బ్యాంకు అనుమతులను వేగవంతం చేస్తుంది, కన్వర్ట్ అయిన ప్లాట్ల మార్కెట్ విలువను మెరుగుపరుస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More