న్యూఢిల్లీ: నీట్-యుజి పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 24, శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. "ప్రతి జిల్లా.. ఒకే రోజు.. ఒకే డిమాండ్" అనే నినాదంతో ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

విద్యార్థి సంఘాలు, పౌర సమాజ వేదికలతో కలిసి ప్రతీ జిల్లా కేంద్రంలోనూ శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టాలని సీజేపీ నాయకత్వం కోరింది. నిరసన ప్రదర్శనలకు సంబంధించి ప్రామాణిక నిబంధనలను (SOP), ప్రచార సామగ్రిని, వినతిపత్రం నమూనాను పార్టీ ఇప్పటికే పంచుకుంది. స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకుని నిరసనలు నిర్వహించాలని, ప్రదర్శనల సమయంలో విద్యార్థుల డిమాండ్లను బిగ్గరగా చదివి వినిపించిన అనంతరం సంబంధిత జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని స్థానిక నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
చర్చల వేదికపై తేలని పీటముడి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ శ్రేణులు, విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతుండగానే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా వంటి ముందస్తు షరతులు లేకుండానే పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సంకేతాలు ఇచ్చింది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం రోజున స్పందిస్తూ సీజేపీ నేతలతో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. "సీజేపీ ప్రతినిధులతో మాట్లాడేందుకు మేము పూర్తి సుముఖంగా ఉన్నాం. వారు నా అధికారిక నివాసానికి గానీ, లేదా కార్యాలయానికి గానీ వచ్చి చర్చలు జరపవచ్చు" అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
అయితే, కేంద్రం ప్రతిపాదించిన వేదికను సీజేపీ సీరియస్గా తిరస్కరించింది. ప్రస్తుతం ఆందోళనలు సాగుతున్న జంతర్ మంతర్ వద్ద లేదా దాని సమీపంలో మాత్రమే చర్చలు జరగాలని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ ఆఫర్ను తోసిపుచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు
{{/usCountry}}అయితే, కేంద్రం ప్రతిపాదించిన వేదికను సీజేపీ సీరియస్గా తిరస్కరించింది. ప్రస్తుతం ఆందోళనలు సాగుతున్న జంతర్ మంతర్ వద్ద లేదా దాని సమీపంలో మాత్రమే చర్చలు జరగాలని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ ఆఫర్ను తోసిపుచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు
{{/usCountry}}న్యూఢిల్లీ: దేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో వెలుగుచూసిన అక్రమాలు, విద్యాశాఖ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. ఈ మేరకు 'సీజేపీ' (CJP) ఆధ్వర్యంలో సాగుతున్న దేశవ్యాప్త ఆందోళనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం రోజున సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ మేరకు ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఒక వీడియో సందేశాన్ని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలాంటి పార్టీ జెండాలు లేదా బానర్లు లేకుండా సాధారణ పౌరులుగా ఈ విద్యార్థి ఆందోళనల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.