చిక్కబళ్లాపూర్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, దేశ పురోగతికి బాటలు వేసేలా ఉండాలని 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సు కోసం కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ముద్దేనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన 'సీఎస్ఆర్ సదస్సు-2026' ముగింపు వేడుకల్లో గురువారం ఆయన అనుగ్రహ భాషణం చేశారు. భారతీయ నాగరికత ఎప్పుడూ ప్రేమ, సేవ, మానవీయ విలువలపైనే ఆధారపడి ఉందన్నారు. ఈ విలువలను రాబోయే తరాలకు అందించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, కార్పొరేట్ రంగాలు, సమాజం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పునాది ఉన్న భారతదేశంలో పారదర్శకత, ఉత్తమ పాలనతో సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేసినప్పుడే సమాజంలో శాశ్వత మార్పు వస్తుందని వివరించారు.
భగవద్గీత సూత్రాలతో కార్పొరేట్ గవర్నెన్స్
భగవద్గీతలోని యజ్ఞం, దానం, తపస్సు అనే సూత్రాలను కార్పొరేట్ పాలనకు అన్వయిస్తూ సద్గురు కీలక విశ్లేషణ చేశారు. యజ్ఞం అంటే ఉత్పాదకత అని, దానం అంటే సమాజ సేవ అని, తపస్సు అంటే ఉత్తమ పాలనకు (Good Governance) ప్రతీక అని పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు ఈ విలువలను అలవర్చుకున్నప్పుడు వ్యాపారంతో పాటు సేవ కూడా విజయవంతమవుతుందన్నారు.
"పిల్లల కోసం చేసే ఖర్చు కేవలం వ్యయం కాదు, అది దేశ భవిష్యత్తుపై పెట్టే అత్యంత విలువైన పెట్టుబడి" అని సద్గురు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
2047 కంటే ముందే 'వికసిత భారత్'
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' అంచనాలకు మించి విస్తరిస్తోందని సద్గురు తెలిపారు. ఈ సంస్థకు అందుతున్న ఆర్థిక సహాయంలో 70 శాతం ప్రవాస భారతీయుల (NRI) నుంచే వస్తోందని, అలాగే 150కి పైగా కంపెనీలు మద్దతు ఇస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 2047 'వికసిత భారత్' లక్ష్యాన్ని అంతకంటే ముందే సాధించాలనేది తమ సంకల్పమన్నారు. దేశంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా విద్య, వైద్యం, పౌష్టికాహారం అందించడమే తమ ధ్యేయమని ప్రకటించారు. అయితే, సరైన భాగస్వామ్యం లేకపోవడం వల్ల చాలా కంపెనీల సీఎస్ఆర్ నిధులు వాడకుండా నిలిచిపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సదస్సులో ప్రముఖుల ప్రశంసలు
{{/usCountry}}భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' అంచనాలకు మించి విస్తరిస్తోందని సద్గురు తెలిపారు. ఈ సంస్థకు అందుతున్న ఆర్థిక సహాయంలో 70 శాతం ప్రవాస భారతీయుల (NRI) నుంచే వస్తోందని, అలాగే 150కి పైగా కంపెనీలు మద్దతు ఇస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 2047 'వికసిత భారత్' లక్ష్యాన్ని అంతకంటే ముందే సాధించాలనేది తమ సంకల్పమన్నారు. దేశంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా విద్య, వైద్యం, పౌష్టికాహారం అందించడమే తమ ధ్యేయమని ప్రకటించారు. అయితే, సరైన భాగస్వామ్యం లేకపోవడం వల్ల చాలా కంపెనీల సీఎస్ఆర్ నిధులు వాడకుండా నిలిచిపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సదస్సులో ప్రముఖుల ప్రశంసలు
{{/usCountry}}ప్రధానమంత్రి జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి మాజీ సలహాదారు ఎస్. రామదొరై మాట్లాడుతూ, సద్గురు దూరదృష్టి ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహార సేవల ద్వారా దేశ సుస్థిర అభివృద్ధికి ఈ సంస్థ ఎనలేని కృషి చేస్తోందని కొనియాడారు. సెబీ మాజీ ఛైర్మన్ ఎం. దామోదరన్, సంపర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వినీత్ నాయర్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్. రవి, 'ది హిందూ బిజినెస్ లైన్' ఎడిటర్ రఘువీర్ శ్రీనివాసన్ ఈ సదస్సులో మాట్లాడారు. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ చేస్తున్న సేవలను అభినందిస్తూ, ఇలాంటి సేవా సంస్థలకు కార్పొరేట్ రంగం నుంచి మరింత సీఎస్ఆర్ మద్దతు లభించాలని అభిప్రాయపడ్డారు.
'వికసిత భారత్ కోసం సీఎస్ఆర్' శ్వేతపత్రం విడుదల
రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సీఎస్ఆర్ నిధుల సమర్థవంతమైన వినియోగం, సామాజిక ప్రభావం, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై నాలుగు సాంకేతిక సెషన్లు నిర్వహించారు. ఇదే వేదికపై 'వికసిత భారత్ కోసం సీఎస్ఆర్' అనే శ్వేతపత్రాన్ని (White Paper) విడుదల చేశారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన టాటా హిటాచీ కన్స్ట్రక్షన్ మెషినరీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్కు 'వికసిత భారత్' పురస్కారాన్ని అందజేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేష్ తివారీతో పాటు పలువురు ప్రతిభావంతులకు సీఎస్ఆర్ పురస్కారాలను అందజేసి సత్కరించారు.