ఫిర్యాదుదారుడిగా వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి!

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరిగింది. ఆమె నివాసంలో ఈ ఉదయం ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Published on: Aug 20, 2025 10:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఈ ఉదయం తన నివాసంలో దాడి జరిగింది. తన నివాసంలో జరిగిన 'జాన్ సున్‌వాయ్' కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఆమె మీద దాడి చేశాడు. ఫిర్యాదుదారుడి వేషంలో వచ్చి దాడి చేశాడు. జాన్ సున్‌వాయ్ కార్యక్రమం అనేది పౌరుల ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక చొరవ.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెంటనే దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. కార్యక్రమానికి ఫిర్యాదుదారుడిలా వేషంలో వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు. దాడి తర్వాత వెంటనే ముఖ్యమంత్రిని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆమె నివాసానికి చేరుకుని భద్రతను పెంచారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యమంత్రి ప్రతి వారం తన నివాసంలో జరిగే జన్ సున్‌వాయ్ సమావేశానికి హాజరవుతారు.

30 సంవత్సరాల వయసున్న వ్యక్తి మెుదట సీఎం దగ్గరకు వచ్చాడు. కొన్ని పేపర్లను చూపించాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో చేస్తున్న పనిని ప్రత్యర్థులు సహించలేకపోతున్నారని, దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. ఈ దాడిని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఖండించారు.

బీజేపీ సీనియర్ నాయకుడు హరీష్ ఖురానా మాట్లాడుతూ..'సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రిపై దాడి చేశాడు. ప్రస్తుతం వైద్యులు ముఖ్యమంత్రిని పరీక్షిస్తున్నారు. మేం దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడి రాజకీయంగా ప్రేరేపించబడిందా అని దర్యాప్తు చేయాలి.' అని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు అతిషి ఈ దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని అన్నారు. 'ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించదగినది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, నిరసనలకు చోటు ఉంటుంది. కానీ హింసకు చోటు లేదు. ఢిల్లీ పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాం.' అని అతిషి అన్నారు.

భద్రతా ఉల్లంఘనకు దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి విచారణ నిర్వహించనున్నట్టుగా ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్‌బీకే సింగ్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More