హైదరాబాద్లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ లేదా బెంగళూరు, గురుగ్రామ్ వంటి ఐటీ కారిడార్లలో పని చేసే కార్పొరేట్ ఉద్యోగులు నెలకు భారీగా జీతాలు సంపాదిస్తారు. కానీ నెల చివరకు వచ్చేసరికి ఖాతాలో పైసా మిగలదు! చేతిలో ఐఫోన్లు, కాస్ట్లీ కార్లు, వీకెండ్ పార్టీలతో ఆడంబరాలకు పోయి ఈఎంఐల ఊబిలో కూరుకుపోవడం నేటి తరంలో సాధారణమైపోయింది. అయితే పెద్ద పెద్ద ఫైనాన్స్ పుస్తకాలు చదవకుండా, ఎలాంటి మొబైల్ యాప్స్ వాడకుండానే ఒక సాదాసీదా మహిళ చూపించిన ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పనిమనిషిగా పనిచేస్తున్న ఆమె నెలకు రూ. 60వేల వరకు సంపాదిస్తోంది!
రోజుకు 6 ఇళ్లు.. నెలకు రూ. 60 వేల సంపాదన!

గురుగ్రామ్కు చెందిన శివ మిట్టల్ అనే వ్యక్తి తన ఇంటి పనిమనిషి కథనాన్ని లింక్డ్ఇన్లో పంచుకున్నారు. ప్రతినెలా ఆమె కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే సెలవులు తీసుకుంటూ, రోజుకు 5 నుంచి 6 ఇళ్లలో వంట, శుభ్రం చేసే పనులు నిర్వహిస్తుంది. ఇలా కష్టపడుతూ నెలకు ఏకంగా రూ. 60,000 వరకు సంపాదిస్తోంది.
"ఆమె తన సంపాదన నుంచి ఇంటి అద్దె రూపంలో రూ. 10,000 చెల్లిస్తూ, కుమార్తెను మంచి ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తోంది. నిత్యవసర ఖర్చులు పోను, స్వగ్రామంలో రూ. 6 లక్షల విలువైన భూమి కోసం క్రమం తప్పకుండా ప్రతినెలా ఈఎంఐ చెల్లిస్తోంది," అని శివ మిట్టల్ రాసుకొచ్చారు.
ఆడంబరాలకు స్వస్తి.. భవిష్యత్తుపైనే దృష్టి
చాలామంది కార్పొరేట్ ఉద్యోగులు విలువ తగ్గిపోయే వస్తువులపై, అంటే ఖరీదైన కార్లు, గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ దుస్తులపై ఈఎంఐలు పెట్టి కొంటుంటారు. సోషల్ మీడియాలో ఇతరులను మెప్పించేందుకు అనవసర ఖర్చులు చేస్తారు. కానీ ఆ పనిమనిషి ఆలోచనా విధానం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందని మిట్టల్ అభిప్రాయపడ్డారు.
"ఆమెకు ఎలాంటి సొంత ఆడంబర కోరికలు లేవు. కుమార్తెకు మంచి భవిష్యత్తును అందించడం, భద్రమైన జీవితాన్ని నిర్మించుకోవడమే ఆమె ఏకైక లక్ష్యం. పైగా ఆమె కడుతున్న ఏకైక ఈఎంఐ కూడా రోజురోజుకూ విలువ పెరిగే ఆస్తి కోసం మాత్రమే," అని ఆయన స్పష్టం చేశారు.
కార్పొరేట్ వర్గాల్లో మొదలైన చర్చ
{{/usCountry}}"ఆమెకు ఎలాంటి సొంత ఆడంబర కోరికలు లేవు. కుమార్తెకు మంచి భవిష్యత్తును అందించడం, భద్రమైన జీవితాన్ని నిర్మించుకోవడమే ఆమె ఏకైక లక్ష్యం. పైగా ఆమె కడుతున్న ఏకైక ఈఎంఐ కూడా రోజురోజుకూ విలువ పెరిగే ఆస్తి కోసం మాత్రమే," అని ఆయన స్పష్టం చేశారు.
కార్పొరేట్ వర్గాల్లో మొదలైన చర్చ
{{/usCountry}}ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కేవలం క్లిష్టమైన ఫార్ములాలు, స్టాక్ మార్కెట్ ఆప్షన్లు కాదని, మన పరిధికి లోబడి బ్రతకడమే అసలైన ఆర్థిక క్రమశిక్షణ అని ఈ సంఘటన నిరూపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ పోస్టుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. "ఆమె కేవలం ఫైనాన్స్ మేనేజరే కాదు, రోజుకు 6 ఇళ్లలో పనిచేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న గొప్ప టైమ్ మేనేజ్మెంట్ నిపుణురాలు," అని ఒక నెటిజన్ ప్రశంసించారు.
లక్షలు సంపాదించే ప్రతి ఐటీ ఉద్యోగి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇది అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.