Hardik Pandya: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హార్దిక్ పాండ్యా.. వాంఖడే స్టాఫ్ అందరికీ చెక్కులు ఇచ్చిన స్టార్ క్రికెటర్

Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. వాంఖడే స్టేడియంలోని స్టాఫ్ అందరికీ ఒక్కొక్కరికి రూ.10 వేల చెక్కులు ఇచ్చాడు. దీని వెనుక అసలు కారణమేంటో చూడండి.

Published on: Mar 27, 2026, 20:56:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ముందు వాంఖడే స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ తనకు చేసిన సాయానికి హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్‌లో థ్యాంక్స్ చెప్పాడు. ప్రతి ఒక్కరికీ 10 వేల రూపాయల చెక్కులు ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడు. వాళ్లతో అతడు ఫొటోలకు పోజులిచ్చాడు.

Hardik Pandya: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హార్దిక్ పాండ్యా.. వాంఖడే స్టాఫ్ అందరికీ చెక్కులు ఇచ్చిన స్టార్ క్రికెటర్ (X Image)
Hardik Pandya: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హార్దిక్ పాండ్యా.. వాంఖడే స్టాఫ్ అందరికీ చెక్కులు ఇచ్చిన స్టార్ క్రికెటర్ (X Image)

తెరవెనుక హార్దిక్ పడిన కష్టం.. గ్రౌండ్ స్టాఫ్ సపోర్ట్..

డొమెస్టిక్ రెడ్ బాల్ సీజన్ జరుగుతున్న టైమ్‌లో, మ్యాచ్ ఫిట్‌నెస్‌ను పక్కాగా మెయింటైన్ చేయడానికి హార్దిక్ పాండ్యా రెగ్యులర్‌గా వాంఖడే గ్రౌండ్‌లోనే ట్రైనింగ్ తీసుకున్నాడు. గతంలో అతనికి చాలా గాయాలు అయిన హిస్టరీ ఉండటంతో, పీక్ ఫిట్‌నెస్‌లో ఉండటం అతనికి చాలా ఇంపార్టెంట్.

అందుకే తెరవెనుక అతను చాలా కష్టపడ్డాడు. ఆ టైమ్‌లో గ్రౌండ్ స్టాఫ్ అతనికి చాలా సపోర్ట్ చేశారు. అతని ప్రాక్టీస్ సెషన్స్ కోసం ఫెసిలిటీస్, కండిషన్స్ ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా రెడీగా ఉండేలా చూసుకున్నారు. వాళ్లు ఇచ్చిన ఆ మద్దతు వల్లే ఆ గ్లోబల్ టోర్నమెంట్ కోసం అతను అద్భుతంగా ప్రిపేర్ అవ్వగలిగాడు. ఫైనల్‌గా ఆ టోర్నీలో మన టీమిండియా టైటిల్ కూడా కొట్టిన విషయం మనకు తెలిసిందే.

వాంఖడేలోని ఎంసీఏ గ్రౌండ్ స్టాఫ్ పెట్టిన ఎఫర్ట్స్‌ను పాండ్యా ప్రత్యేకంగా గుర్తించాడు. ఆ కఠినమైన ట్రైనింగ్ దశలో తనకు అండగా నిలబడినందుకు వాళ్లకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాడు. ఒక క్రికెటర్ సక్సెస్ జర్నీలో గ్రౌండ్ స్టాఫ్ చేసే పనికి జనరల్‌గా పెద్దగా గుర్తింపు దక్కదు. కానీ హార్దిక్ చేసిన ఈ పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన ఆల్ రౌండర్..

మన ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ఈ స్టార్ ఆల్ రౌండర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ టోర్నీ మొత్తంలో అతను 163.11 స్ట్రైక్ రేట్‌తో 199 రన్స్ కొట్టాడు, చాలా క్రూషియల్ మూమెంట్స్‌లో టీమ్‌ను ఆదుకున్నాడు.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అతను కీ రోల్ ప్లే చేశాడు. బౌలింగ్ అటాక్‌ను ఓపెన్ చేసే బాధ్యతను కూడా తీసుకుని, స్టార్టింగ్‌లోనే వికెట్లు తీసి ఎదుటి టీమ్‌ను ప్రెజర్‌లో పెట్టాడు. టోర్నీ మొత్తంలో ఎనిమిది వికెట్లు పడగొట్టి ఈ షార్టెస్ట్ ఫార్మాట్‌లో తన వాల్యూ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

మాట నిలబెట్టుకున్న పాండ్యా.. జితేష్ శర్మ కామెంట్స్

టీ20 వరల్డ్ కప్ తర్వాత గ్రౌండ్ స్టాఫ్‌కు ఒక స్పెషల్ రివార్డ్ ఇస్తానని అతను అప్పట్లోనే మాటిచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి ముందే వాళ్లందరికీ 10 వేల రూపాయల చెక్కులు ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నాడు.

రీసెంట్‌గా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కూడా గ్రౌండ్ బయట హార్దిక్ చూపించే మంచి మనసు గురించి ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. రణ్‌వీర్ అలహాబాదియా పాడ్‌కాస్ట్‌లో జితేష్ మాట్లాడుతూ.. "హార్దిక్ భాయ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్. చిన్న పిల్లలకు అన్ని బ్యాట్లు పంచిపెట్టే వ్యక్తని నేను ఇంతవరకు చూడలేదు. నేను ఏమీ అడగకుండానే నాకు కూడా ఒకసారి ఒక బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అతను చాలా మంది కుర్రాళ్లకు సాయం చేస్తాడు. ఇక వాళ్ల అన్నయ్య కృనాల్ భాయ్ అయితే, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీకు కావలసినంత సాయం చేస్తాడు" అని చెప్పాడు.

ఇక ఈ స్టార్ ఆల్ రౌండర్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఐపీఎల్ 2026లో అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు. ముంబై ఇండియన్స్ తమ ఫస్ట్ మ్యాచ్‌ను మార్చి 30న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడబోతోంది. తన ఫామ్‌ను ఈ కొత్త సీజన్‌లో కూడా కంటిన్యూ చేయాలని హార్దిక్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More