...
...
Next Story

Hyundai discounts : ఈ ఫిబ్రవరిలో కొత్త వెహికిల్​ కొనాలా? హ్యుందాయ్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు..

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫిబ్రవరి నెలకు గానూ తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వెర్నా, ఐ20, ఎక్స్​టర్​, గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లపై గరిష్టంగా రూ. 73,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 6, 2026, 16:15:47 IST
Advertisement

కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి హ్యుందాయ్ మోటార్ ఇండియా తీపి కబురు అందించింది. ఈ ఫిబ్రవరి నెలలో.. పలు ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను, బెనిఫిట్స్​ని ప్రకటించింది. వెర్నా, i20, ఎక్స్​టర్​, గ్రాండ్ ఐ10 నియోస్ వంటి కార్లు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి. డీలర్లను బట్టి ఇవి మారుతుంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఫిబ్రవరి 2026లో హ్యుందాయ్ కార్లపై లభించే ప్రయోజనాలు:

హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు..
హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు..

హ్యుందాయ్ వెర్నా: ఈ మిడ్‌సైజ్ సెడాన్‌పై ఫిబ్రవరిలో అత్యధికంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్​ని ఇస్తోంది హ్యుందాయ్ సంస్థ. సౌకర్యవంతమైన ప్రయాణం, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి వెర్నా ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

హ్యుందాయ్ ఐ20: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన ఐ20పై రూ. 48,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీనితో పాటు, ఐ20లోని కొన్ని వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలను హ్యుందాయ్ సవరించింది.

ఎరా వేరియంట్: ఇప్పుడు రూ. 5.99 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. గత ధరతో పోల్చితే ఇదే రూ. 1లక్ష తక్కువ!

మాగ్నా ఎగ్జిక్యూటివ్: గతంలో రూ. 6,86,865 ఉండగా, ఇప్పుడు రూ. 6,73,900 కి తగ్గింది.

మాగ్నా వేరియంట్: రూ. 7,12,385 నుంచి రూ. 6,99,900 కి తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

హ్యుందాయ్ ఎక్స్​టర్​: హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్​టర్'పై ఫిబ్రవరిలో రూ. 33,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో స్టైలిష్ ఎస్‌యూవీ లుక్ కోరుకునే వారిని ఈ కారు ఆకట్టుకుంటోంది.

సాధారణ డిస్కౌంట్లతో పాటు వాలెంటైన్స్ డే వీక్​ సందర్భంగా ఫిబ్రవరి 8న హ్యుందాయ్ 'ఆల్వేస్ అరౌండ్ క్యాంప్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఒక్క రోజు క్యాంపులో కారు అమ్మకాలు, సర్వీసింగ్, వెహికల్ ఎక్స్​ఛేంజ్​ ఆఫర్లపై అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

వినియోగదారులు తమకు సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించి, వేరియంట్ల వారీగా లభించే పూర్తి వివరాలను తెలుసుకోవాలని కంపెనీ సూచించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe