భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉంది : రాష్ట్రపతి
భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఐఎఫ్ఆర్లో భాగంగా ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ప్రయాణించారు.
భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉందని, విస్తృత సముద్ర వాణిజ్యంలో స్థిరత్వానికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFRలో రాష్ట్రపతి పాల్గొన్నారు. సముద్రంలో తలెత్తే ముప్పులు, సవాళ్లకు వ్యతిరేకంగా భారత నావికాదళం ఈ ప్రాంతంలో మోహరించిందన్నారు.

'భారత నావికాదళం భారతదేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉంది. విస్తృత సముద్ర వాణిజ్యంలో స్థిరత్వానికి దోహదపడుతోంది.' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికాదళాలతో సద్భావనను పెంపొందించడంలో నమ్మకం, విశ్వాసం, స్నేహాన్ని నిర్మించడంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత నౌకాదళం తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) ఉన్న విశాఖపట్నం అద్భుతమైన సముద్ర చరిత్రను కలిగి ఉందని అన్నారు. ఐఎఫ్ఆర్ కార్యక్రమం విశాఖపట్నం శాశ్వత నౌకాదళ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని వ్యాఖ్యానించారు.
అద్భుతమైన యుద్ధనౌకలను, నావికాదళ సిబ్బంది, ఇతర ప్రదర్శనలను వీక్షించి రాష్ట్రపతి అభినందించారు. సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఐక్యత, నమ్మకం, గౌరవాన్ని ఐఎఫ్ఆర్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. వివిధ జెండాలు కలిగిన ఓడలు, వివిధ దేశాల నావికులు కలిసి ఉండే స్ఫూర్తిని ప్రదర్శిస్తారని అన్నారు. మహాసముద్రాలను భారతదేశానికి వాణిజ్యం, అనుసంధానం, సాంస్కృతిక మార్పిడి మార్గాలుగా అభివర్ణించారు.
అంతకుముందు విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితోపాటుగా గవర్నర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయాణించారు. 18 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


