జేఈఈ టాపర్లకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్ విజిట్ ఛాన్స్.. మీతోపాటు పేరెంట్కి ఫ్లైట్ టికెట్ ఫ్రీ
జేఈఈ అడ్వాన్స్డ్లో టాపర్లను ఆకర్షించడానికి ఐఐటీ మద్రాస్ టాప్ 200 టాపర్లను క్యాంపస్ విజిట్ కోసం ఆహ్వానించింది. దీనితో పాటు ఇన్స్టిట్యూట్ విమాన టిక్కెట్లను కూడా అందిస్తోంది.
ండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంది. జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో 200 మంది టాపర్లకు ఈ సంస్థ ప్రత్యేక ఆహ్వానం అందిస్తోంది. దీని కోసం విమాన టిక్కెట్ల నుండి వసతి వరకు ప్రతిదీ ఉచితంగా ఇస్తుంది. విద్యార్థితో పాటు తల్లిదండ్రులలో ఒకరి ఛార్జీని కూడా సంస్థ చెల్లిస్తుంది.

దేశంలోని ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ వాతావరణాన్ని చూపించడమే దీని ఉద్దేశం. ఐఐటీలో అధ్యయనాలు ఎలా జరుగుతాయో, ఇక్కడ ఏ అవకాశాలు అందుబాటులో ఉన్నాయో టాపర్లు తెలుసుకోవచ్చు. ఏ ఐఐటీ, ఏ కోర్సును ఎంచుకోవాలనుకుంటున్నారో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకోవాలని సంస్థ కోరుకుంటోంది. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితం జూన్ 2న వచ్చింది. ఇందులో రజిత్ గుప్తా భారతదేశంలోనే మొదటి ర్యాంకు సాధించారు.
ప్రతి సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ప్రకటించిన తర్వాత అనేక అగ్రశ్రేణి ఐఐటీలు పూర్వ విద్యార్థుల సమావేశాలు, మార్గదర్శకత్వం వంటి వివిధ పద్ధతులను ఉపయోగించి విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఈసారి ఐఐటీ మద్రాస్ ఒక అడుగు ముందుకు వేసి విద్యార్థి, వారి తల్లిదండ్రులలో ఒకరికి విమాన ఛార్జీలను చెల్లించాలి క్యాంపస్ విజిట్ చేయించాలని నిర్ణయించింది.
ఈ పర్యటనలో, విద్యార్థులను క్యాంపస్ను చూపించనున్నారు. వారు ప్రొఫెసర్లతో మాట్లాడగలరు, ప్రయోగశాలలు, హాస్టళ్లను చూడగలరు. ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులను కలుస్తారు.
'కేవలం విద్య పరంగానే కాకుండా సమాజం, పరిశోధన, మద్దతు పరంగా కూడా ఇక్కడ జీవితం నిజంగా ఎలా ఉంటుందో విద్యార్థులకు చూపించడానికి, అనుభవాన్ని సృష్టించాలని మేం కోరుకుంటున్నాం.' అని ఐఐటీ మద్రాస్ అధికారి ఒకరు మీడియాతో అన్నారు. దీని అర్థం విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, అలాగే స్నేహం, ఆవిష్కరణ, సపోర్ట్ ఎలా ఉంటుందో వాతావరణాన్ని చూడవచ్చు.
ఐఐటీ టాపర్లు సంస్థ కొత్త పరిశోధన, ఆవిష్కరణ ప్రయోగశాలలు, వ్యవస్థాపక సెల్, ప్రపంచంతో భాగస్వామ్యాల గురించి తెలుసుకునే అవకాశం కూడా పొందుతారు. చాలా మంది టాప్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు ఐఐటీ మద్రాస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper













