భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది! ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా తూర్పు మధ్యప్రదేశ్లో ఆగస్టు 22న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో రానున్న వారం రోజుల్లో దక్షిణ భారతదేశంలో రుతుపవనాల ప్రభావం కాస్త మందగించనుందని తెలిపింది.
మధ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు..

ఈ వారం మధ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్లో ఆగస్టు 22 నుంచి 25 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఆగస్టు 22 నుంచి 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. విదర్భ ప్రాంతంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు వర్షాలు పడతాయని అంచనా వేశారు.
వాయువ్య భారతదేశంలో ఉత్తరాఖండ్లో ఆగస్టు 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాల్లో ఆగస్టు 22-23 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. హరియాణా, చండీగఢ్, దిల్లీలో ఆగస్టు 22న వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్లో ఆగస్టు 22 నుంచి 24 వరకు వర్షాలు పడతాయని తెలిపారు.
తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం..
తూర్పు భారతదేశంలోని గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఆగస్టు 22 నుంచి 27 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఝార్ఖండ్, ఒడిశాలో కూడా ఈ సమయంలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈశాన్య భారతదేశంలో రానున్న వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వివరించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆగస్టు 26-27 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఆగస్టు 22-23 తేదీలలో.. అనంతరం ఆగస్టు 25-27 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
{{/usCountry}}ఈశాన్య భారతదేశంలో రానున్న వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వివరించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆగస్టు 26-27 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఆగస్టు 22-23 తేదీలలో.. అనంతరం ఆగస్టు 25-27 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
{{/usCountry}}మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచివున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ జిల్లాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.
దక్షిణ భారతదేశంలో పరిస్థితి ఏంటి?
దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో మాత్రం వర్షాలు చాలా వరకు చెదురుమదురుగా కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. అయితే తీర ప్రాంత కర్ణాటక, కేరళ, మాహె, లక్షద్వీప్లలో మాత్రం ఆగస్టు 27 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
జూన్, జులై వర్షపాత సరళి..
గత నెలల పరిస్థితులను పరిశీలిస్తే.. జూన్ నెలలో సాధారణం కంటే 35.4 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, అయితే జులైలో మాత్రం సాధారణం కంటే 1 శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.
ఇక జూన్ 1 నుంచి ఆగస్టు 18 మధ్య కాలంలో సేకరించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 12.6 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.