అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ను ఆరోసారి గెలిచింది యంగిండియా. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత యువ సైన్యం ప్రపంచ క్రికెట్లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి.. చరిత్రలో అత్యధికంగా ఆరుసార్లు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఫైనల్లో ఇంగ్లండ్ ను 100 పరుగులతో చిత్తుగా ఓడించింది. 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 311 పరుగులకే ఆలౌటైంది.
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 411 పరుగుల భారీ స్కోరు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే సెమీస్ హీరో ఆరోన్ జార్జ్ వికెట్ కోల్పోవడం కాస్త నిరాశ కలిగించింది. కానీ క్రీజులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ రీవ్ ఎన్ని ప్లాన్లు వేసినా వైభవ్ జోరు ముందు అవి పనిచేయలేదు.
కెప్టెన్ ఆయుష్ మాత్రే (53 పరుగులు, 51 బంతుల్లో) చక్కటి సహకారం అందించగా.. వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించినా మన్నీ లమ్స్డెన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు తీసినా, భారత టెయిలెండర్లు పోరాడటంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ రికార్డు స్థాయిలో 411/9 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఫాల్కనర్ పోరాడినా.. భారత్దే విజయం
412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. డాకిన్స్, బెన్ మేస్, థామస్ రీవ్ల ద్వారా గట్టిగానే బదులివ్వాలని ప్రయత్నించింది. అయితే భారత్ సరైన సమయంలో వికెట్లు తీసి దెబ్బకొట్టింది. అంబ్రిష్ తొలి బ్రేక్ ఇవ్వగా.. 21వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ ఓవర్లో సెట్ బ్యాటర్ డాకిన్స్, రాల్ఫిన్ ఆల్బర్ట్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఒకానొక దశలో 177/7తో ఓటమి అంచున నిలిచింది.
అయితే కాలేబ్ ఫాల్కనర్ (115 పరుగులు, 67 బంతుల్లో), జేమ్స్ మింటో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫాల్కనర్ చివరి వరకు పోరాడి అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ భారీ లక్ష్యం ముందు ఆ పోరాటం సరిపోలేదు. చివరికి కనిష్క్ చౌహాన్ బౌలింగ్లో ఫాల్కనర్ ఔట్ అవ్వడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కప్ ముద్దాడింది.
{{/usCountry}}అయితే కాలేబ్ ఫాల్కనర్ (115 పరుగులు, 67 బంతుల్లో), జేమ్స్ మింటో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫాల్కనర్ చివరి వరకు పోరాడి అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ భారీ లక్ష్యం ముందు ఆ పోరాటం సరిపోలేదు. చివరికి కనిష్క్ చౌహాన్ బౌలింగ్లో ఫాల్కనర్ ఔట్ అవ్వడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కప్ ముద్దాడింది.
{{/usCountry}}