టీ20 వరల్డ్ కప్ చివరి సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ ను 5 వికెట్లతో చిత్తు చేసింది టీమిండియా. సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ తో ఈ మెగా టోర్నీలో ఇండియన్ టీమ్ తన అత్యధిక టార్గెట్ చేజ్ చేసింది. అంతేకాదు చేజింగ్ లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ క్రికెటర్ గా విరాట్ కోహ్లి రికార్డును కూడా శాంసన్ బ్రేక్ చేశాడు. అతడు చివరికి 50 బంతుల్లో 97 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. మార్చి 5న ముంబైలో ఇంగ్లండ్ తో సెమీఫైనల్లో టీమిండియా తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడం ఇది ఆరోసారి.
సంజూ ‘స్పెషల్’ శాంసన్

సంజూ శాంసన్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ తో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరింది టీమిండియా. వెస్టిండీస్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 196 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే శాంసన్ సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. శాంసన్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. తిలక్ వర్మ కూడా 15 బంతుల్లో 27 రన్స్ చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఆరంభంలో నిలకడ.. చివర్లో విధ్వంసం
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. ఓపెనర్లు శుభారంభం ఇవ్వగా, మిడిల్ ఓవర్లలో రోస్టన్ ఛేజ్ (40) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే అసలైన విధ్వంసం ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో జరిగింది. రోవ్మన్ పావెల్, జేసన్ హోల్డర్ భారత బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు.
ఇన్నింగ్స్ చివరిలో రోవ్మన్ పావెల్ (34*), జేసన్ హోల్డర్ (37*) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా అర్ష్దీప్ సింగ్ వేసిన 16వ ఓవర్లో పావెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు.
బుమ్రా వేసిన 20వ ఓవర్లో హోల్డర్ తొలి బంతికే సిక్సర్ బాదగా, నాలుగో బంతిని పావెల్ బౌండరీకి పంపాడు. ఈ ఓవర్లో మొత్తం 14 పరుగులు రావడంతో విండీస్ స్కోరు 190 దాటింది.
{{/usCountry}}బుమ్రా వేసిన 20వ ఓవర్లో హోల్డర్ తొలి బంతికే సిక్సర్ బాదగా, నాలుగో బంతిని పావెల్ బౌండరీకి పంపాడు. ఈ ఓవర్లో మొత్తం 14 పరుగులు రావడంతో విండీస్ స్కోరు 190 దాటింది.
{{/usCountry}}భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీసి ఫర్వాలేదనిపించినప్పటికీ, ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. ఫీల్డింగ్లో అభిషేక్ శర్మ.. రోస్టన్ చేజ్ క్యాచ్ డ్రాప్ చేయడం భారత్కు ప్రతికూలంగా మారింది.