సాధారణంగా రోడ్డు పక్కన దీనస్థితిలో యాచిస్తున్న వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. తమకు తోచిన సహాయం చేస్తారు. కానీ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం చూస్తే మాత్రం.. మనం ఎవరికి సహాయం చేస్తున్నాం? అనే అనుమానం కలగక మానదు. ఇండోర్ను 'భిక్షాటన రహిత' నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో ఒక 'కోటీశ్వరుడైన బిచ్చగాడు' అధికారుల కంటపడ్డాడు.
యాచకుడు కాదు.. కోటీశ్వరుడు

ఇండోర్లోని ప్రముఖ సరాఫా బజార్ ప్రాంతంలో మాంగీలాల్ అనే వ్యక్తి ఏళ్ల తరబడి భిక్షాటన చేస్తున్నాడు. దివ్యాంగుడు కావడంతో, చేతులతో తోసుకుంటూ వెళ్లే బండిపై తిరుగుతూ అతను అందరినీ సహాయం కోరేవాడు. అతని పరిస్థితి చూసి జాలిపడ్డ జనం రోజుకు రూ. 500 నుండి రూ. 1000 వరకు ఇచ్చేవారు. అయితే, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పునరావాసం కోసం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మాంగీలాల్కు ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏకంగా మూడు ఇళ్లు ఉన్నాయి. ఇందులో ఒకటి బహుళ అంతస్తుల భవనం కాగా, మరొకటి 600 చదరపు అడుగుల నివాసం. ఇక్కడితో ఆగకుండా.. అతనికి మూడు ఆటో రిక్షాలు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా ఉన్నాయి. వీటిని ఇతరులకు అద్దెకు ఇచ్చి ప్రతి నెలా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు.
అర్హత లేకున్నా ప్రభుత్వ పథకం!
ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, మాంగీలాల్ అత్యంత పేదలకు ఇచ్చే 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన' (PMAY) కింద ఒక బెడ్రూమ్ ఇంటిని కూడా దక్కించుకోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. అసలు ఇన్ని ఆస్తులు ఉన్న వ్యక్తికి ప్రభుత్వ పథకం ఎలా దక్కింది? ఎవరు సహకరించారు? అనే కోణంలో అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
బిచ్చగాడు మాత్రమే కాదు.. పెద్ద వడ్డీ వ్యాపారి
విచారణలో తేలిన మరో విషయం ఏమిటంటే.. మాంగీలాల్ కేవలం యాచకుడిగానే కాకుండా, సరాఫా బజార్లోని చిన్న వ్యాపారులకు వడ్డీకి డబ్బులు ఇచ్చే వ్యాపారం కూడా చేస్తున్నాడు. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వసూలు చేయడం చట్టరీత్యా నేరం కావడంతో, దీనిపై కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అతని బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల పత్రాలు, ఇతర ఆదాయ వనరులను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అసలు లక్ష్యం నెరవేరుతోంది..
{{/usCountry}}విచారణలో తేలిన మరో విషయం ఏమిటంటే.. మాంగీలాల్ కేవలం యాచకుడిగానే కాకుండా, సరాఫా బజార్లోని చిన్న వ్యాపారులకు వడ్డీకి డబ్బులు ఇచ్చే వ్యాపారం కూడా చేస్తున్నాడు. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వసూలు చేయడం చట్టరీత్యా నేరం కావడంతో, దీనిపై కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అతని బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల పత్రాలు, ఇతర ఆదాయ వనరులను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అసలు లక్ష్యం నెరవేరుతోంది..
{{/usCountry}}ఇండోర్ నగరాన్ని భిక్షాటన రహితంగా మార్చే ఈ ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు వేలమంది యాచకులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిలో నిజమైన పేదలకు వసతి, ఉపాధి, పిల్లలకు విద్య కల్పిస్తున్నామని, మాంగీలాల్ వంటి వారి అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నామని పేర్కొన్నారు.