అమెరికాలో ఇన్ఫోసిస్ ఉద్యోగి అరెస్ట్ కాలేదు: వైరల్ వార్తలపై స్పందించిన సీఈఓ సలీల్ పరేఖ్
అమెరికాలో తమ ఉద్యోగిని అధికారులు అరెస్ట్ చేశారనే వార్తల్లో నిజం లేదని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్ట్లపై స్పందిస్తూ, ఎవరినీ నిర్బంధించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
అమెరికాలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఐసిఇ (ICE) అధికారులు అరెస్ట్ చేశారని, విమానంలో అవమానించారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆ సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని, తమ ఉద్యోగులెవరూ అక్కడ నిర్బంధానికి గురికాలేదని ఆయన స్పష్టం చేశారు.
సలీల్ పరేఖ్ వివరణ: అసలు జరిగింది?
జనవరి 14న కంపెనీ మూడో త్రైమాసిక (Q3) ఫలితాల ప్రకటన సందర్భంగా సలీల్ పరేఖ్ ఈ అంశంపై మాట్లాడారు.
"అమెరికా అధికారులు ఇన్ఫోసిస్ ఉద్యోగి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే, కొన్ని నెలల క్రితం మా ఉద్యోగి ఒకరికి అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు (Denied Entry). దీంతో ఆయనను తిరిగి ఇండియాకు పంపించారు. అంతే తప్ప, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు" అని ఆయన వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనం ఇదే..
జనవరి 13న 'చేతన్ అనంతరాము' అనే వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు. మైసూరుకు చెందిన ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగి అమెరికాలో ఆన్-సైట్ పనిలో ఉండగా, ఐసిఇ ఏజెంట్లు వచ్చి ఆయనను అదుపులోకి తీసుకున్నారని ఆ పోస్ట్ సారాంశం.
సదరు ఉద్యోగికి సామాన్లు సర్దుకోవడానికి కేవలం రెండు గంటల సమయం ఇచ్చారని, జైలుకు వెళ్తారా లేదా ఇండియాకు వెళ్తారా అని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించారు. అంతేకాకుండా, ఫ్రాంక్ఫర్ట్ మీదుగా ఇండియాకు వచ్చే విమానంలో.. "ఈ ప్రయాణికుడు పారిపోకుండా చూడాలని" సిబ్బంది అనౌన్స్మెంట్ చేసి అవమానించారని కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
స్పష్టత ఇచ్చిన ఐటీ దిగ్గజం
వైరల్ పోస్ట్లో పేర్కొన్నట్లుగా అది ఈ మధ్య జరిగిన సంఘటన కాదని, కొన్ని నెలల క్రితం జరిగిన 'ఎంట్రీ నిరాకరణ' ఉదంతం అని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. సాధారణంగా వీసా నిబంధనలు లేదా డాక్యుమెంటేషన్లో లోపాలు ఉన్నప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎంట్రీ నిరాకరించి వెనక్కి పంపిస్తుంటారు. దానిని 'అరెస్ట్' గా చిత్రీకరించడం సరికాదని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


