రూ. 21లక్షల వరకు ప్యాకేజీతో ఇన్ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ డ్రైవ్​​.. అప్లికేషన్​కి ఇంకా 2 రోజులే ఛాన్స్​

ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే వారి కోసం ఇన్ఫోసిస్ ఆఫ్​ క్యాంపస్​ డ్రైవ్​ని కొనసాగిస్తోంది. భారీ పే ప్యాకేజీతో ఈ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ జరుగుతోంది. అప్లికేషన్​కి ఇంకా రెండు రోజులే ఛాన్స్​ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 23, 2025, 14:00:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాఫ్ట్‌వేర్ రంగాన్ని కెరీర్​గా ఎంచుకోవాలని చూస్తున్న వారికి కీలక అప్డేట్​. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​కి సంబంధించిన ఆఫ్​ క్యాంపస్​ మాస్​ హైరింగ్​ 2025 ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మల్టీనేషనల్ కంపెనీలో అడుగుపెట్టేందుకు మీకు ఇదే సరైన అవకాశం. 2025 పాసౌట్​ బ్యాచ్​ వారికోసం ప్రత్యేకంగా జరుగుతున్న ఈ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇన్పోసిస్​ ఆఫ్​-క్యాంపస్​ హైరింగ్​ వివరాలు.. (AFP)
ఇన్పోసిస్​ ఆఫ్​-క్యాంపస్​ హైరింగ్​ వివరాలు.. (AFP)

ఇన్ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ 2025- పోస్టులు, జీతాలు..

రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు ఆకర్షణీయమైన శాలరీ ప్యాకేజీలను ఇన్ఫోసిస్ ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా 'స్పెషలిస్ట్ ప్రోగ్రామర్' వంటి పోస్టులకు కళ్లు చెదిరే ప్యాకేజీలు ఇస్తోంది. అవి..

స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్​3 (ట్రైనీ): ఏడాదికి రూ. 21 లక్షల ప్యాకేజీ.

స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్​2 (ట్రైనీ): ఏడాదికి రూ. 16 లక్షల ప్యాకేజీ.

స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్​1 (ట్రైనీ): రూ. 10 లక్షల ప్యాకేజీతో పాటు రూ. 1 లక్ష జాయినింగ్ బోనస్.

డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ): రూ. 6.25 లక్షల ప్యాకేజీతో పాటు రూ. 75,000 జాయినింగ్ బోనస్.

టెక్నికల్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యం, రియల్ టైమ్ ప్రాజెక్టులపై ఆసక్తి ఉన్న వారికి ఈ హోదాలు చక్కగా సరిపోతాయి.

ఇన్ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ 2025- అర్హత ప్రమాణాలు..

ఈ డ్రైవ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి:

బీఈ / బీటెక్​,

ఎంఈ / ఎంటెక్​,

ఎసీఏ లేదా ఎంఎస్​సీ (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్).

అర్హత కలిగిన బ్యాచ్: కేవలం 2025లో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  • చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల్లో ఆంధ్ర వారే ఎక్కువ! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇన్ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ 2025- దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇన్ఫోసిస్ అధికారిక అప్లికేషన్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు స్వయంగా ఫారమ్ నింపాల్సి ఉంటుంది. మీరు అందించిన వివరాల ఆధారంగా ఇన్ఫోసిస్ టీమ్ దరఖాస్తులను స్క్రీనింగ్​ చేస్తుంది. ఆపై అర్హులను తదుపరి రౌండ్లకు ఎంపిక చేస్తుంది.

కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ గురువారం, డిసెంబర్ 25, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్లికేషన్​కి ఇంకా రెండు రోజుల అవకాశం మాత్రమే ఉంది.

ఇన్​ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐటీ ఇండస్ట్రీలో బలమైన పునాది వేయాలనుకునే ప్రతిభావంతులైన యువతకు ఇదొక సువర్ణావకాశం. మెరుగైన శిక్షణ, మంచి పని వాతావరణం, దీర్ఘకాలిక కెరీర్ వృద్ధిని ఇన్‌ఫోసిస్ అందిస్తోంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More