దేశీయ స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు కుప్పకూలాయి. గురువారం నాటి ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోవడంతో ఐటీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక్కరోజే 4.6 శాతం పతనమై 33,471 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో ఐటీ ఇండెక్స్ విలువ రూ. 28.9 లక్షల కోట్ల నుంచి రూ. 27.6 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు సుమారు రూ. 1.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

2026 ప్రారంభం నుంచి ఐటీ రంగానికి కాలం కలిసిరావడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐటీ ఇండెక్స్ సుమారు 11 శాతం నష్టపోయింది. కేవలం గత నెల రోజుల్లోనే 12 శాతం మేర పతనం కావడం ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచుతోంది.
ఐటీ షేర్లు ఎందుకు పడిపోయాయి?
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఐటీ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
1. ఏఐ (AI) భయాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న పెనుమార్పులు సాంప్రదాయ ఐటీ సర్వీస్ కంపెనీలకు సవాలుగా మారాయి. ముఖ్యంగా 'ఆంత్రోపిక్' (Anthropic) వంటి ఏఐ స్టార్టప్లు కొత్త టూల్స్ తీసుకురావడంతో, పాత సాఫ్ట్వేర్ పద్ధతులు కాలగర్భంలో కలిసిపోతాయనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. ఇది ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై ప్రభావం చూపుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది.
"ఏఐ షాక్ నుంచి టెక్ స్టాక్స్ ఇప్పుడప్పుడే కోలుకోవడం కష్టమే. భారత ఐటీ రంగం మరికొంత కాలం ఇబ్బందులు పడే అవకాశం ఉంది" అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ అభిప్రాయపడ్డారు.
2. అమెరికా ఉద్యోగ గణాంకాలు - వడ్డీ రేట్లు: అమెరికాలో జనవరి నెల ఉద్యోగ గణాంకాలు ఆశించిన దానికంటే మెరుగ్గా వచ్చాయి. 70,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తే, ఏకంగా 1,30,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరగా తగ్గించకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు తగ్గకపోతే ఐటీ కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
3. డాలర్ బలోపేతం: అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో డాలర్ ఇండెక్స్ 97 స్థాయికి చేరుకుంది. ఇది రిస్క్ ఎక్కువగా ఉండే ఐటీ వంటి రంగాలపై ఒత్తిడి పెంచింది.
పాతాళానికి టీసీఎస్.. టాప్ లూజర్స్ ఇవే!
{{/usCountry}}3. డాలర్ బలోపేతం: అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో డాలర్ ఇండెక్స్ 97 స్థాయికి చేరుకుంది. ఇది రిస్క్ ఎక్కువగా ఉండే ఐటీ వంటి రంగాలపై ఒత్తిడి పెంచింది.
పాతాళానికి టీసీఎస్.. టాప్ లూజర్స్ ఇవే!
{{/usCountry}}నేటి ట్రేడింగ్లో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ నష్టాల బాట పట్టాయి:
- టీసీఎస్ (TCS): ఈ కంపెనీ షేర్లు 4.5 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి (రూ. 2,776) కి చేరాయి.
- కోఫోర్జ్ (Coforge): 5.5 శాతంతో అత్యధికంగా నష్టపోయింది.
- ఎల్టీఐ మైండ్ట్రీ (LTI Mindtree): 5 శాతం పైగా క్షీణించింది.
- ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా: ఇవన్నీ 4 శాతానికి పైగా నష్టపోయాయి.
- హెచ్సీఎల్ టెక్, ఎంఫాసిస్: ఇవి 2.5 నుంచి 4 శాతం మధ్య క్షీణించాయి.
టెక్నికల్ వ్యూ: ఐటీ ఇండెక్స్ ప్రస్తుతం 36,000 మార్కు కింద ట్రేడ్ అవుతోంది. ఇది సాంకేతికంగా బలహీనతను సూచిస్తోందని బోనాంజా టెక్నికల్ అనలిస్ట్ ధ్రుమిల్ విత్లానీ పేర్కొన్నారు. మార్కెట్ కోలుకునే సమయంలో షేర్లను విక్రయించడమే (Sell on rise) ప్రస్తుతానికి ఉత్తమ వ్యూహమని ఆయన సూచిస్తున్నారు.