సన్​రూఫ్​ ఉన్న టాప్​-5 ఎస్​యూవీలు ఇవి.. ధర రూ. 15లక్షల కన్నా తక్కువే!

పానోరమిక్​ సన్​రూఫ్​తో కూడిన ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో రూ. 15లక్షల కన్నా తక్కువ ధరకు, సన్​రూఫ్​ ఫీచర్​తో లభిస్తున్న టాప్​-5 ఎస్​యూవీల లిస్ట్​ని ఇక్కడ చూడండి..

Published on: Dec 17, 2025, 11:01:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది భారతీయులు ఇప్పుడు ఒక కారు కొనేముందు అనేక ఫీచర్లను దృష్టిల్ పెట్టుకుంటున్నారు. ఆ చెక్​-లిస్ట్​ పూర్తి అయితేనే సంబంధిత మోడల్​ని కొనేందుకు ముందుకెళుతున్నారు. ఈ చెక్​-లిస్ట్​లో పానోరమిక్​ సన్​రూఫ్​ ఫీచర్​ కచ్చితంగా ఉంటోంది!

కియా సైరోస్​ ఎస్​యూవీ..
కియా సైరోస్​ ఎస్​యూవీ..

భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో కార్లలో పానోరమిక్ సన్‌రూఫ్‌ల ప్రాక్టికాలిటీపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఈ ఫీచర్ వాటి మోడల్, పరిమాణంతో సంబంధం లేకుండా కార్లకు ఒక ప్రీమియం లుక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి గతంలో ఈ ఫీచర్​ లగ్జరీ, ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మాస్​ మార్కెట్​ మోడల్స్​కి కూడా అందుబాటులోకి వచ్చింది.

మీరు పానోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన, రూ. 15 లక్షల లోపు ధర కలిగిన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ టాప్ ఐదు ఆప్షన్స్​ని ఇస్తున్నాము. చెక్​ చేయండి..

రూ. 15లక్షల లోపు ధరలో సన్​రూఫ్​ ఉన్న ఎస్​యూవీలు..

1. కియా సైరోస్-

పానోరమిక్ సన్‌రూఫ్‌తో భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కారు ఈ కియా సైరోస్! ఈ ఫీచర్ హెచ్​టీకే+, హెచ్​టీఎక్స్​, హెచ్​టీఎక్స్​+, హెచ్​టీఎక్స్​+ (ఓ) వేరియంట్స్​లో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 10.74 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ ఇప్పటికే తన ఫీచర్ ప్యాక్డ్ ప్రీమియం క్యాబిన్, బెస్ట్ ఇన్ క్లాస్ స్పేస్​తో అనేక ప్రమాణాలను నెలకొల్పింది. ఇందులో 12.3-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 5.0-ఇంచ్​ క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేతో కూడిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంది. దీంతో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్​ వంటి కీలక ఫీచర్లు కూడా లభిస్తాయి.

2. టాటా నెక్సాన్-

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో ఒకటైన టాటా నెక్సాన్ అనేక ఫీచర్లతో కూడిన సరసమైన ప్యాకేజీగా ఉంది! ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో లభించే ముఖ్య లక్షణాల్లో ఒకటి పానోరమిక్ సన్‌రూఫ్. ఈ ఫీచర్​ ఉన్న క్రియేటివ్ ప్లస్ పీఎస్, ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్ వేరియంట్ల ధర రూ. 11.25 లక్షల నుంచి రూ. 14.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది పానోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన భారతదేశంలోనే అత్యంత చవకైన కార్లలో ఒకటి. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్​ ఫీచర్లు కూడా ఉన్నాయి.

3. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ-

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఇది ఏఎక్స్​7, ఏఎక్స్​7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధర రూ. 11.66 లక్షల నుంచి రూ. 14.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆసక్తికరంగా, ఈ సెగ్మెంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ పొందిన మొదటి కారు ఇది. అంతేకాక, ఒకప్పుడు ఈ ఫీచర్ ఉన్న అత్యంత చవకైన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఇదే. ఇందులో డ్యూయల్ 10.25-ఇంచ్​ స్క్రీన్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్​ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

4. హ్యుందాయ్ క్రెటా-

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన హ్యుందాయ్ క్రెటా ఈఎక్స్​(ఓ), ఎస్​(ఓ), ఎస్​(ఓ) నైట్, ఎస్​ఎక్స్​, ఎస్​ఎక్స్​ టెక్, ఎస్​ఎక్స్​ ప్రీమియం, ఎస్​ఎక్స్​(ఓ), కింగ్, కింగ్ నైట్ వంటి ట్రిమ్స్‌లో పానోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తోంది. వీటి ధర రూ. 12.52 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. క్రెటాలో పానోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ 10.25-ఇంచ్​ స్క్రీన్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెవల్ 2 అడాస్​, 360-డిగ్రీ కెమెరా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

5. టాటా సియెర్రా-

తాజాగా మార్కెట్లోకి వచ్చిన టాటా సియెర్రా భారత మార్కెట్‌లో అతిపెద్ద పానోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తోంది. సాధారణంగా సన్‌రూఫ్ మధ్య లేదా అధిక వేరియంట్స్​లో లభిస్తుంది. కానీ సియెర్రా ఈ ఫీచర్‌ను బేస్ వేరియంట్ నుంచే అందిస్తుంది. రూ. 14.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే ఈ ఎస్‌యూవీలో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఏఆర్ ఆధారిత హెడ్-అప్ డిస్‌ప్లే, లెవల్ 2 అడాస్​ వంటి ఫీచర్లు ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More