బంగ్లాదేశ్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. అక్కడి నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోల్కతా, దాని పరిసర జిల్లాలు సహా ఈశాన్య భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది.

యూరోపియన్- మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఈ భూకంపం తొలుత బంగ్లాదేశ్లో సంభవించింది. నార్సింగ్దిలోని మధాబ్ది ప్రాంతంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. భూమికి 10 కి.మీల లోతున భూ ప్రకంపనలు రికార్డు అయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్పై 5.2గా నమోదైందని తెలుస్తోంది.
భూకంపం కారణంగా బంగ్లాదేశ్- ఐర్లాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్కి అంతరాయం ఏర్పడింది. భూమి కంపించిన వెంటనే క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్లో నుంచి మైదానం వైపు పరుగులు తీశారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఆట మొదలైంది.
కోల్కతాలో పరిస్థితి ఇలా..
మరోవైపు భూ ప్రకంపనల ధాటికి కోల్కతావాసులు హడలెత్తిపోయారు. చాలా మంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
భూమి కంపించడంపై అనేక మంది కోల్కతావాసులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
“నా జీవితంలో ఇలాంటి భూకంపం చూడలేదు,” అని ఒకరు పోస్ట్ చేయగా.. “ఈ భూకంపం చాలా ఎక్కువసేపు ఉంది. 30 సెకన్ల కన్నా ఎక్కువసేపు భూమి కంపించింది,” అని మరొకరు పేర్కొన్నారు.
ఊగుతున్న సీలింగ్ ఫ్యాన్స్, షేక్ అవుతున్న టేబుల్స్కి సంబంధించిన వీడియోలను కొందరు ఆన్లైన్లో పోస్ట్ చేశారు.
కోల్కతాలో భూ ప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
{{/usCountry}}కోల్కతాలో భూ ప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
{{/usCountry}}గత కొన్ని రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపాలు, భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వారం తొలినాళ్లల్లో అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రికార్ట్ స్కేల్పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. భూమికి 90 కి.మీల దిగువన ఇది కేంద్రీకృతమైంది.
భూకంపాలు సంభవించే లోతు ఆధారంగా అవి కలిగించే నష్టం మారుతుంది. సాధారణంగా, లోతు తక్కువగా ఉండే భూకంపాలు, లోతు ఎక్కువగా ఉండే భూకంపాల కంటే అధిక ప్రమాదకరమైనవి!
భూకంపం ఎంత లోతులో సంభవిస్తే, భూకంప తరంగాలు అంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల అవి ఉపరితలం చేరుకునేసరికి వాటి శక్తి క్రమంగా తగ్గిపోయి, భూమి కంపించే తీవ్రత తగ్గుతుంది.
కాగా శుక్రవారం ఉదయం పాకిస్థాన్లో కూడా భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 5.2 తీవ్రత నమోదైంది.