విద్యార్థులపై కేసులు ఎత్తివేత: ఎన్డీయే పాలిత రాష్ట్రాల నిర్ణయం
దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్, అసోం ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, అరెస్టయిన వారిని విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాయి.
ఇటీవల జరిగిన విద్యార్థి ఆందోళనల్లో అరెస్టయిన యువతకు ఊరటనిస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగు వేశాయి. మహారాష్ట్ర, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు నిరసనకారులపై నమోదైన పోలీసు కేసులను ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టాయి. అయితే చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉండటంతో, అదుపులోకి తీసుకున్న వందలాది మంది విద్యార్థుల విడుదల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

మహారాష్ట్రలో ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ బాధ్యతలు చూస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను (FIRs) ఉపసంహరించుకోవాలని హోంశాఖను ఆదేశించారు. జూలై 20న జరిగిన పోలీసుల చర్యలకు నిరసనగా, దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతుగా జూలై 23, 24 తేదీల్లో ముంబై, పుణే, నాగ్పూర్లలో విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టవిరుద్ధంగా గుమిగూడారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. సీజేపీ డిమాండ్తో స్పందించిన ప్రభుత్వం ఈ కేసులు ఎత్తివేసేందుకు ఆదేశాలిచ్చింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు.. బెంగాల్లో బెయిల్
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన నిరసనల్లో అరెస్టయిన 16 మందికి మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసిన తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకుంది.
"విద్యార్థుల ఆందోళనల్లో జరిగిన హింసపై నిష్పాక్షికమైన, సమగ్రమైన విచారణ జరగాలి" అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
అరెస్టయిన మైనర్లను వెంటనే విడుదల చేయాలని, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని, వారి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. క్రిమినల్ రికార్డులు ఉన్నవారికి మినహా మిగిలిన విద్యార్థులకు ఈ రక్షణ వర్తిస్తుందని బెంగాల్ హోంశాఖ ప్రకటించింది.
బిహార్, అసోంలలో విడుదల ప్రక్రియ షురూ
బిహార్ ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి 64 ఎఫ్ఐఆర్లను రద్దు చేసేందుకు న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. జూలై 25న జరిగిన నిరసనల్లో పోలీసులు 694 మందిని అదుపులోకి తీసుకోగా, ఇంకా 405 మంది జైలులోనే ఉన్నారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనలకు సంబంధించిన 27 ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ గురించి పట్నా కోర్టుకు సమాచారం ఇచ్చామని, బుధవారం నుంచి విడుదలలు ప్రారంభమవుతాయని పట్నా జిల్లా ప్రభుత్వ ప్లీడర్ రాజేష్ కుమార్ వెల్లడించారు.
అటు అసోం ప్రభుత్వం కూడా ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోకూడదని నిర్ణయించింది. నమోదు చేసిన 5 కేసులను ఉపసంహరించుకుంటూ, అరెస్టయిన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అజయ్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


