Stock market : ట్రేడ్​ డీల్​ ఎఫెక్ట్​.. 15 నిమిషాల్లో రూ. 13 లక్షల కోట్లు ప్లస్​!

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలతో ఓపెన్​ అయ్యాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్​- అమెరికా ట్రేడ్​ డీల్​ ఖరారవ్వడం ఇందుకు కారణం.

Published on: Feb 3, 2026, 09:17:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ స్టాక్​ మార్కెట్​లో పండుగ వాతావరణం నెలకొంది! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్​- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరడంతో దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అతి భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 2648 పాయింట్లు వృద్ధి చెంది 85,314 వద్ద ఓపెన్​ అయ్యింది. నిఫ్టీ50 1,220 పాయింట్లు పెరిగి 26,308 వద్ద సెషన్​ని మొదలుపెట్టింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ ఏకంగా 2,792 పాయింట్లు పెరిగి 61,411 వద్ద ఓపెన్​ అయ్యింది.

స్టాక్​ మార్కెట్​లకు భారీ లాభాలు..
స్టాక్​ మార్కెట్​లకు భారీ లాభాలు..

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ మొదటి 15 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 13లక్షల కోట్లు పెరిగింది! బీఎస్​ఈ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 468.32 లక్షల కోట్లకు చేరింది. ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​ కోసం స్టాక్​ మార్కెట్​ ఎంత ఎదురుచూసిందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​ ఎందుకు ముఖ్యం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధించిన సుంకాలు భారత ఎగుమతులను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్​ టారిఫ్​లు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. తొలుత 25శాతం సుంకాలు విధించిన ట్రంప్​, రష్యా చమురు అంశంలో భారత్​పై మరో 25శాతం సుంకాలు విధించారు. ఫలితంగా చాలా నెలల పాటు భారత్​ 50శాతం సుంకాలను ఎదుర్కొంటూ వస్తోంది.

దేశీయ స్టాక్​ మార్కెట్​లు దాదాపు ఏడాది కాలంగా పెరగడపోవడానికి, ఎఫ్​ఐఐలు భారీ మొత్తంలో సెల్లింగ్​ చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ టారిఫ్​లు. అందుకే ఈ సుంకాల భారం తగ్గాలన్నా, స్టాక్​ మార్కెట్​లు పెరగాలన్నా ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​ జరగాల్సిందే అని నిపుణులు చెబుతూ వచ్చారు.

వాస్తవానికి ఈ వాణిజ్య ఒప్పందం నెలల ముందే జరుగుతుందని అందరు ఊహించారు. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సోమవారం రాత్రి కీలక్​ ప్రకటన చేశారు. ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​ కుదిరినట్టు, ఫలితంగా భారత్​పై ప్రస్తుతం ఉన్న 50శాతం సుంకాలను 18శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.

ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ ప్రకటనను స్టాక్​ మార్కెట్​లు అత్యంత సానుకూలంగా తీసుకున్నాయి. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో అతి భారీ లాభాలతో ఓపెన్​ అయ్యాయి

లాభాలే.. లాభాలు..

బీఎస్​ఈ సెన్సెక్స్​ 30లో అన్ని స్టాక్స్​ లాభాల్లో దూసుకెళుతున్నాయి. కొన్ని అయితే అతి భారీ లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్​ 7శాతం, బజాజ్​ ఫినాన్స్​ 6శాతం, ఎటర్నల్​ 6శాతం, ఇన్ఫోసిస్​ 4శాతం, రిలయన్స్​ 4శాతం మేర లాభాలను చూస్తున్నాయి.

బంగారం, వెండి కూడా..

భారత్​- అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రభావం బంగారం, వెండీ ధరలపైనా పడింది! గత కొన్ని రోజులుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న లోహాలు.. మంగళవారం భారీగా పెరిగాయి.

ఎంసీఎక్స్​ గోల్డ్​ 3శాతం పెరిగి రూ. 1,48,310 (10గ్రాములు)కి చేరింది. ఎంసీఎక్స్​ సిల్వర్​ అయితే ఏకంగా 6శాతం అప్పర్​ సర్క్యూట్​ హిట్​ చేసింది. ప్రస్తుతం కేజీకి రూ. 2,50,436 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో స్పాడ్​ గోల్డ్​ 4.2శాతం పెరిగి ఔన్సుకు 4,855 డాలర్లకు చేరింది.

రూపాయి కూడా..

యూఎస్​- అమెరికా ట్రేడ్​ డీల్​ కారణంగా రూపాయి భారీగా బలపడింది (1.2శాతం). డాలర్​తో పోల్చితే రూపాయి ప్రస్తుతం 90.40 వద్ద ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More