...
...
Next Story

మారుతి నుంచి తొలి సీఎన్‌జీ ఆటోమేటిక్ కార్: సెప్టెంబర్ 5న కొత్త బాలెనో లాంచ్

భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో కొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో అలరించేందుకు సిద్ధమైంది. మారుతి సంస్థలోనే తొలిసారిగా సీఎన్‌జీ-ఏఎమ్‌టీ ఆటోమేటిక్ టెక్నాలజీతో రానున్న ఈ కారు విశేషాలు పరిశీలించండి.

Updated on: Aug 21, 2026, 11:43:36 IST
Advertisement

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతి సుజుకి బాలెనో (Baleno) సరికొత్త రూపంలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సెప్టెంబర్ 5న అధికారికంగా విడుదల చేయనున్నారు. భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా వంటి కార్లతో ఇది నేరుగా పోటీపడనుంది.

నయా ఇంజిన్.. మారుతి చరిత్రలోనే మొదటి సీఎన్‌జీ ఆటోమేటిక్

మారుతి నుంచి తొలి సీఎన్‌జీ ఆటోమేటిక్ కార్: సెప్టెంబర్ 5న కొత్త బాలెనో లాంచ్ (@YouTube/Harsh VLOGS)
మారుతి నుంచి తొలి సీఎన్‌జీ ఆటోమేటిక్ కార్: సెప్టెంబర్ 5న కొత్త బాలెనో లాంచ్ (@YouTube/Harsh VLOGS)

ఈ కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ కేవలం లుక్స్, డిజైన్‌లోనే కాకుండా మెకానికల్ పరంగానూ కీలక మార్పులతో వస్తోంది. సరికొత్త స్విఫ్ట్‌లో అందిస్తున్న 1.2-లీటర్ 'జెడ్-సిరీస్' (Z-Series) 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఈ కారులో ఉపయోగించనున్నారు. ఇదే ఇంజిన్‌తో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ (CNG) ఆప్షన్ కూడా లభిస్తుంది.

అయితే, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మారుతి సుజుకి తమ వాహన శ్రేణిలోనే తొలిసారిగా 'సీఎన్‌జీ-ఏఎమ్‌టీ' (CNG-AMT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌ను ఈ బాలెనో ఫేస్‌లిఫ్ట్ ద్వారా పరిచయం చేయబోతోంది.

మైలేజ్, డ్రైవింగ్ హాయి కలిసొచ్చే టెక్నాలజీ

సీఎన్‌జీ-ఏఎమ్‌టీ టెక్నాలజీ ద్వారా వాహనదారులకు రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. పెట్రోల్, సీఎన్‌జీ రెండు ఆప్షన్లు ఉండటంతో సుదీర్ఘ ప్రయాణాలు చేసేందుకు వీలవుతుంది. సీఎన్‌జీ మోడ్‌లో నడపడం వల్ల ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మరోవైపు, ట్రాఫిక్ నిండిన నగర రహదారులపై పదే పదే గేర్లు మార్చే అవసరం లేకుండా ఏఎమ్‌టీ (Automated Manual Transmission) సులువైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.

సంప్రదాయ ఫుల్లీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పోలిస్తే ఏఎమ్‌టీ టెక్నాలజీ తక్కువ ధరకే లభించడమే కాకుండా, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని, తక్కువ నిర్వహణ వ్యయాన్ని అందిస్తుంది. డ్రైవర్ తన అవసరానికి తగినట్లుగా దీనిని ఆటోమేటిక్ లేదా మాన్యువల్ మోడ్‌లో నడుపుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

పోటీదారులకు సవాలు.. ఏడీఏఎస్ (ADAS) ఫీచర్లు

ఇతర కీలక మార్పుల విషయానికొస్తే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోనే తొలిసారిగా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను కూడా ఈ బాలెనో ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe