మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి వెలువడే ప్రభుత్వ పత్రిక 'హమ్షాహ్రీ' (Hamshahri) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి కారణమైన 13 మంది విదేశీ రాజకీయ, సైనిక నాయకులను లక్ష్యంగా చేసుకోవాలంటూ వారి ఫోటోలతో కూడిన ఇన్ఫోగ్రాఫిక్ను ఈ పత్రిక విడుదల చేసింది.

అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు అయాతొల్లా మొజ్తబా ఖమేనీ తొలిసారి బహిరంగంగా స్పందించిన కొద్దిసేపటికే ఈ జాబితా వెలుగులోకి వచ్చింది.
"ప్రతికారం అనేది మా జాతీయ సంకల్పం, దీనిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. మా లిస్టులో ఉన్న ఈ నేరస్థులు, తమ పడకలపై ప్రశాంతంగా మరణించాలనే కోరికను తమతో పాటే సమాధి చేసుకుంటారు" అని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.
అయితే మొజ్తబా ఖమేనీ నిర్దిష్టంగా ఎవరి పేర్లనూ బహిరంగంగా ప్రస్తావించలేదు. అలాగే ఈ పత్రిక ప్రచురించిన జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.
ఇరాన్ 'రివెంజ్ లిస్ట్' లోని 13 మంది నేతలు:
హమ్షాహ్రీ పత్రిక ప్రచురించిన ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం లక్ష్యంగా చేసుకోవాల్సిన నాయకులు వీరే:
- డొనాల్డ్ ట్రంప్ – అమెరికా అధ్యక్షుడు
- బెంజమిన్ నెతన్యాహు – ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి
- జార్జియా మెలోని – ఇటలీ ప్రధాన మంత్రి
- కీర్ స్టార్మర్ – బ్రిటన్ ప్రధాన మంత్రి
- ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ – ఫ్రాన్స్ అధ్యక్షుడు
- ఫ్రీడ్రిచ్ మెర్జ్ – జర్మనీ ఛాన్సలర్
- ఇజ్రాయెల్ కాట్జ్ – ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
- గిడియాన్ సార్ – ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి
- ఇయాల్ జమీర్ – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) చీఫ్
- మార్కో రూబియో – అమెరికా విదేశాంగ మంత్రి (Secretary of State)
- పీట్ హెగ్సెత్ – అమెరికా రక్షణ మంత్రి (Secretary of Defense)
- జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా / బ్రాడ్ కూపర్ – యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్లు
- మైక్ హక్కబీ – ఇజ్రాయెల్లో అమెరికా రాయబారి
ఈ జాబితాలో యూరప్ నేతలు ఎందుకు ఉన్నారు?
అమెరికా, ఇజ్రాయెల్ అధికారులతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల అధినేతలను కూడా ఇరాన్ ఈ జాబితాలో చేర్చింది. తమ భూభాగంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఖండించడంలో యూరప్ దేశాలు విఫలమయ్యాయని ఇరాన్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా, అమెరికా సైనిక విమానాలు తమ వైమానిక దాడుల కోసం యూరప్ దేశాల వాయుమార్గాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించడం ద్వారా ఆయా దేశాలు కూడా ఈ దాడుల్లో భాగస్వాములయ్యాయని టెహ్రాన్ భావిస్తోంది.
ప్రస్తుత యుద్ధ పరిస్థితి
{{/usCountry}}అమెరికా, ఇజ్రాయెల్ అధికారులతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల అధినేతలను కూడా ఇరాన్ ఈ జాబితాలో చేర్చింది. తమ భూభాగంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఖండించడంలో యూరప్ దేశాలు విఫలమయ్యాయని ఇరాన్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా, అమెరికా సైనిక విమానాలు తమ వైమానిక దాడుల కోసం యూరప్ దేశాల వాయుమార్గాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించడం ద్వారా ఆయా దేశాలు కూడా ఈ దాడుల్లో భాగస్వాములయ్యాయని టెహ్రాన్ భావిస్తోంది.
ప్రస్తుత యుద్ధ పరిస్థితి
{{/usCountry}}హార్ముజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ దళాల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడంతో, అమెరికా ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లు, డ్రోన్ కేంద్రాలపై భారీ దాడులు చేసింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ కూడా అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, జోర్డాన్, ఒమన్) క్షిపణులతో విరుచుకుపడింది.
ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన తాత్కాలిక అవగాహన పూర్తిగా దెబ్బతిన్నదని నిపుణులు భావిస్తున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడుతుందని ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, ఖతార్, ఈజిప్ట్ దేశాలు శాంతి చర్చల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు.