MG Majestor : ఏప్రిల్ 20న మార్కెట్లోకి ఎంజీ మెజెస్టర్- బడా ఎస్యూవీ బుకింగ్స్ షురూ..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త లగ్జరీ ఎస్యూవీ ‘మెజెస్టర్’ను ఏప్రిల్ 20న విడుదల చేయనుంది. ఈ ఎస్యూవీ బుకింగ్స్ ఇప్పటికే రూ. 41,000తో ప్రారంభమయ్యాయి. ఆఫ్రోడింగ్ సామర్థ్యం, అత్యాధునిక టెక్నాలజీ దీని ప్రత్యేకత.
ఎంజీ మోటార్ ఇండియా తన ఎస్యూవీ పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ.. కొత్త ఫ్లాగ్షిప్ మోడల్ 'మెజెస్టర్'ను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. హెక్టార్, ఆస్టర్, గ్లోస్టర్ వంటి విజయవంతమైన మోడళ్ల తర్వాత వస్తున్న ఈ మెజెస్టర్.. కంపెనీ ఐసీఈ విభాగంలో అత్యంత ఖరీదైన, అథ్యంత విలాసవంతమైన కారుగా నిలవనుంది.

ఎంజీ మెజెస్టర్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు ఎంజీ అధికారిక వెబ్సైట్ ద్వారా రూ. 41,000 చెల్లించి ఈ ఎస్యూవీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ- పవర్, పర్ఫార్మెన్స్..
ఎంజీ మెజెస్టర్ కారులో గ్లోస్టర్ నుంచి సేకరించిన శక్తివంతమైన 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ను అమర్చారు. ఇది 215 బీహెచ్పీ పవర్ను, 478 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేసి ఉంటుంది. ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సిస్టమ్తో వచ్చే ఈ కారులో సాండ్, మడ్, రాక్, స్నో వంటి మల్టిపుల్ టెర్రైన్ మోడ్స్ ఉన్నాయి.
సెగ్మెంట్లోనే మొదటిసారిగా ఇందులో 'ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్' ఫీచర్ను అందించారు. దీని 810 ఎంఎం వాటర్ వేడింగ్ కెపాసిటీ (నీటిలో ప్రయాణించే సామర్థ్యం) దీని ఆఫ్రోడింగ్ సత్తాను చాటుతోంది.
ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ- డిజైన్, ఎక్స్టీరియర్..
ఎంజీ మెజెస్టర్ చాలా బోల్డ్, ట్రెడిషనల్ ఎస్యూవీ లుక్లో కనిపిస్తుంది. ఇందులో డ్రాగన్ ఐ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ట్రై-బీమ్ స్టాక్డ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ ఉన్నాయి. 19- ఇంచ్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, క్రోమ్ సైడ్ స్టెప్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ను ఇస్తున్నాయి.
Toyota new cars : టయోటా క్రేజీ ప్లాన్- న్యూ జెన్ ఫార్చ్యూనర్తో పాటు ఈ కొత్త కార్లు లాంచ్..
ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ- విలాసవంతమైన ఇంటీరియర్..
ఈ ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ 6, 7 సీట్ల కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. క్యాబిన్ లోపల 'స్మోక్డ్ ఎబోనీ' ఇంటీరియర్స్, లెదర్ అప్హోలిస్ట్రీ, 8 రకాల ప్యాటర్న్స్ ఉన్న మసాజ్ సీట్లు ప్రత్యేక ఆకర్షణ.
టెక్నాలజీ: 12.3- ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, జేబీఎల్ 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్.
స్మార్ట్ ఫీచర్లు: వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్ప్లే, డ్యూయల్ వైర్లెస్ ఛార్జర్స్, 220వీ పవర్ అవుట్లెట్.
జియో కనెక్టివిటీ: ఎంజీ- జియో భాగస్వామ్యంతో బ్లూటూత్ కీ, వాలెట్ మోడ్, క్వైట్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందించారు.
ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ- సేఫ్టీ ఫీచర్లు..
మెజెస్టర్ కారును హై-టెన్సైల్ లాడర్-ఫ్రేమ్ ఛాసిస్పై నిర్మించారు. భద్రత కోసం ఇందులో లెవల్ 2 అడాస్ ఫీచర్లు ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, 6 ఎయిర్బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు పూర్తి భద్రతను కల్పిస్తాయి.
ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే, ఇందులో 343 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా, మూడవ వరుస సీట్లను ఫోల్డ్ చేస్తే అది 1,350 లీటర్ల వరకు పెరుగుతుంది.
లాంచ్ నాటికి ఈ ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ ధర సహా పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ఎంజీ మెజెస్టర్ ఎప్పుడు లాంచ్ కానుంది, దీని బుకింగ్ ధర ఎంత?
ఎంజీ మెజెస్టర్ ఏప్రిల్ 20న భారతదేశంలో అధికారికంగా లాంచ్ కానుంది. దీనిని రూ. 41,000 చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
2. ఈ కారులో ఉన్న ఇంజిన్, పర్ఫార్మెన్స్ వివరాలు ఏంటి?
ఇందులో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది 215 బీహెచ్పీ పవర్, 478 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో వస్తుంది.
3. మెజెస్టర్లో ఉన్న ప్రత్యేకమైన సేఫ్టీ, టెక్ ఫీచర్లు ఏంటి?
ఈ ఎస్యూవీలో లెవల్ 2 అడాస్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్తో పాటు సెగ్మెంట్లోనే మొదటిసారిగా ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్, 810 ఎంఎం వాటర్ వేడింగ్ కెపాసిటీని అందించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


