పర్సనల్ లోన్ ఈఎంఐ ఒక్కసారి మిస్ అయితే ఎంత నష్టమో మీకు తెలుసా?
పర్సనల్ లోన్ ఈఎంఐని మిస్ చేస్తే ఏం అవ్వదు అనుకోవడం చాలా పొరపాటు! ఒక్కసారి మిస్ అయితే అది క్రెడిట్ స్కోర్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా ఎందుకు? మిస్ అయితే ఏం చేయాలి? మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..s
'పర్సనల్ లోన్ ఈఎంఐని ఒక్కసారి మిస్ చేస్తే ఏమవుతుందిలే' అని మీరు అనుకోవచ్చు. అయితే, ఇది మీ క్రెడిట్ హెల్త్, భవిష్యత్తులో రుణాలు పొందే సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిణామాలకు దారితీస్తుందని మీరు తెలుసుకోవాలి.

తెలివైన రుణగ్రహీతలు ఎప్పుడూ తమ చెల్లింపు తేదీలను లేదా బకాయిలను కోల్పోకుండా చూసుకోవాలి. వారి క్రెడిట్ ప్రొఫైల్ నమ్మదగినదిగా, పారదర్శకంగా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం.
పర్సనల్ లోన్ ఈఎంఐని మిస్ అవ్వడం అనేది రుణగ్రహీత ఆర్థిక బలహీనత, ప్రణాళిక లేమి, పేలవమైన నిర్వహణను సూచిస్తుంది. ఇది రుణం ఇచ్చిన సంస్థ దృష్టిలో పెద్ద ప్రతికూల అంశం. ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్ ఈఎంఐ మిస్ అయితే ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..
క్రెడిట్ స్కోర్పై తక్షణ ప్రభావం..
ఒక ఈఎంఐని కట్టకపోయినా, రుణగ్రహీత క్రెడిట్ స్కోర్లో 50 నుంచి 70 పాయింట్ల వరకు తక్షణ పతనం సంభవించవచ్చు!
అంతేకాకుండా, ఒక నెల ఆలస్యం, అంటే 30 రోజులు ఆలస్యమైతే, మీ ఇటీవలి క్రెడిట్ హిస్టరీని బట్టి 90 నుంచి 100 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్ల వరకు స్కోరు తగ్గుతుంది.
పేమెంట్ హిస్టరీకి ఒకరి క్రెడిట్ స్కోర్కు ప్రత్యక్ష సంబంధం ఉంది. అందుకే అధిక క్రెడిట్ స్కోర్ అంటే క్లీన్ రీపేమెంట్ హిస్టరీ అని అర్థం.
సీఆర్ఐఎఫ్ హై మార్క్, సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ వంటి ప్రముఖ క్రెడిట్ బ్యూరోలు ఈ క్రెడిట్ స్కోర్లను అందిస్తాయి. అంతేకాక, మిస్ అయిన చెల్లింపులు మీ క్రెడిట్ రిపోర్ట్లో చాలా సంవత్సరాల పాటు కనిపిస్తాయి.
పెరుగుతున్న పెనాల్టీలు, డిఫాల్ట్ ప్రమాదాలు, దీర్ఘకాలిక నష్టం..
ఈఎంఐ ఆలస్యంగా చెల్లించిన లేదా మిస్ అయితే విధించే ఆలస్య రుసుములు సాధారణంగా బకాయి ఉన్న ఈఎంఐలో 1% నుంచి 2% వరకు ఉంటాయి. దీనికి అదనంగా, చెల్లించాల్సిన మొత్తంపై పెనాల్టీ వడ్డీ ఖర్చులు కూడా ఉంటాయి!
ఒకవేళ రుణం 90 రోజులకు మించి చెల్లింపు లేకుండా ఉంటే, అది ఎన్పీఏ (నిరర్థక ఆస్తి)గా పరిగణిస్తారు. ఇది రుణగ్రహీత క్రెడిట్ ప్రొఫైల్కు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
పర్సనల్ లోన్ ఈఎంఐ గడువు తేదీలను పాటించడంలో విఫలమైతే, రుణగ్రహీతపై రికవరీ చర్యలు తీసుకోవచ్చు.
చాలా తీవ్రమైన సందర్భాల్లో, కలెక్షన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్లు, ప్రత్యక్ష సంభాషణల తర్వాత, ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం, భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు.
బ్యాడ్ క్రెడిట్ రికార్డు, డిఫాల్ట్ (ఎగవేత) మీ క్రెడిట్ రిపోర్ట్లో చాలా సంవత్సరాలు ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో కొత్త పర్సనల్ లోన్లు, గృహ రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం మరియు పొందడం చాలా క్లిష్టంగా మారుతుంది.
మీ క్రెడిట్ సమగ్రతను ఎలా కాపాడుకోవాలి?
మీ క్రెడిట్ సమగ్రత చెక్కుచెదరకుండా ఉండటానికి, మీరు ఈ కింది చర్యలు తీసుకోవాలి:
మీ పర్సనల్ లోన్ ఈఎంఐల కోసం ఆటో-డెబిట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోండి. గడువు తేదీలను ఏమాత్రం కోల్పోకుండా ఉండటంపై పూర్తి దృష్టి పెట్టాలి.
మీ అప్పుల చెల్లింపులకు సంబంధించి మీకు సందేహాలు లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, భయపడకండి; మీరు ఒంటరిగా లేరు.
ఒక ధృవీకరించిన ఆర్థిక సలహాదారుని సంప్రదించి, మీ సమస్యను స్పష్టంగా చర్చించండి.
కేవలం మౌనంగా డిఫాల్ట్ అయ్యే బదులు, వెంటనే మీ రుణం ఇచ్చిన సంస్థను సంప్రదించి, రుణాన్ని పునర్నిర్మాణం చేయమని లేదా మొరటోరియం ఇవ్వమని అడగండి. ఇటువంటి పరిస్థితుల్లో బహిరంగ సంభాషణ చాలా ముఖ్యం.
అనుకోని ఆదాయ సమస్యలను తట్టుకోవడానికి, కనీసం మూడు ఈఎంఐలను కవర్ చేసేలా ఒక ఎమర్జెన్సీ ఫండ్ నిర్వహించడానికి ప్రయత్నించండి.
మీ క్రెడిట్ రిపోర్ట్ను నిరంతరం సమీక్షించండి, ఏమైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయండి. ఏవైనా తేడాలు కనిపిస్తే, వెంటనే మీ సంబంధిత క్రెడిట్ బ్యూరోను సంప్రదించండి.
రుణం తీసుకోవాలనుకునేవారు, పర్సనల్ లోన్ ఈఎంఐని మిస్ చేయడం అనేది చిన్న అసౌకర్యం కంటే ఎంతో ఎక్కువ అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది మీ క్రెడిట్ సమగ్రతను గణనీయంగా కోల్పోయేలా చేస్తుంది, క్రెడిట్ స్కోర్లో తీవ్రమైన పతనానికి దారితీస్తుంది. అంతేకాక, బలహీనమైన క్రెడిట్ ప్రొఫైల్ భవిష్యత్తు రుణాలపై వడ్డీ ఖర్చులు పెరగడానికి కూడా దారితీస్తుంది. అందుకే ముందు జాగ్రత్త తీసుకోవడం వలన రుణగ్రహీతలను తర్వాత వచ్చే పెద్ద ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్ లోన్ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


