ఎటర్నల్ నుంచి రిలయన్స్ వరకు- కోటాక్ సెక్యూరిటీస్ దీపావళి స్టాక్ పిక్స్ ఇవి..
రిలయన్స్ నుంచి ఎటర్నల్ వరకు.. ఈ సంవత్ 2082 కోసం కోటాక్ సెక్యూరిటీస్ సూచించిన స్టాక్స్ టు బై లిస్ట్ని ఇక్కడ చూసేయండి. ఆయా స్టాక్స్ ఎందుకు పెరిగే అవకాశం ఉందో కూడా కోటాక్ సెక్యూరిటీస్ వెల్లడించింది.
భారతీయ స్టాక్ మార్కెట్లలో సంవత్ 2081 నిరాశ పరిచింది. ఈ కాలంలో బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ — 1% కంటే ఎక్కువ పడిపోయాయి. గత ఏడాది కాలంలో లాభాలు తగ్గడం, టారిఫ్ల అనిశ్చితి, భౌగోళిక-రాజకీయ సమస్యలు, స్థూల ఆర్థిక సవాళ్లు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.

మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు మరింత తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 5.6%, స్మాల్క్యాప్ 5.4% మేర పతనమయ్యాయి.
2025 ముహూర్త ట్రేడింగ్..
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్వహించే ఒక గంట ముహురత్ ట్రేడింగ్ సెషన్లో స్టాక్స్ కొనుగోలు చేయడానికి మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తారు. దీపావళి పండుగ హిందూ సంవత్ నూతన సంవత్సరానికి ప్రారంభాన్ని సూచిస్తుంది కాబట్టి, ఆ రోజున నామమాత్రపు కొనుగోళ్లు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ సెషన్ అక్టోబర్ 21న మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల మధ్య జరగనుంది.
సంవత్ 2082లో కొనుగోలు చేయదగిన స్టాక్స్..
దేశీయ బ్రోకరేజ్ సంస్థ కోటాక్ సెక్యూరిటీస్.. సంవత్ 2082 కోసం భారతీయ స్టాక్ మార్కెట్పై జాగ్రత్తతో కూడిన బుల్లిష్ (Cautiously Bullish) వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ మేరకు 7 స్టాక్స్ని సూచించింది. అవి..
1. అదానీ పోర్ట్స్- టార్గెట్ ప్రైజ్ రూ. 1900
ADSEZ పోర్ట్ పోర్ట్ఫోలియోలో మూడింట రెండు వంతుల భాగంలో బలమైన వాల్యూమ్ వృద్ధి ఉంటుందని కోటాక్ అంచనా వేస్తోంది. తూర్పు తీరంలోని పోర్టులు బలమైన వృద్ధికి, పెట్టుబడి ప్రోత్సాహానికి సిద్ధంగా ఉన్నాయని బ్రోకరేజ్ పేర్కొంది. కంటైనర్ల నుంచే అధిక వాల్యూమ్ వస్తుందని భావిస్తున్నారు. 2029 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,400 కోట్ల టాప్లైన్, రూ. 2800 కోట్ల ఎబిట్డా అంచనా వేసింది.
2. అకూటాస్ కెమికల్- రూ. 1780
ఫార్మా ఇంటర్మీడియట్లు అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తిలో వేగంగా వృద్ధి చెందుతున్న ఈ సంస్థ, ప్రక్రియ మెరుగుదలలు, అనుకూలమైన మిశ్రమం కారణంగా మార్జిన్ విస్తరణను చూసింది. కంపెనీ మెరుగైన మార్జిన్లతో 25% ఆదాయ వృద్ధి అంచనాను పునరుద్ఘాటించింది. ప్రస్తుతం, కంపెనీ 3 సీడీఎంఓ ప్రాజెక్టులు చర్చలో ఉన్నాయి, 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4 FY26) నుండి ఆదాయాన్ని అందించే అవకాశం ఉంది.
3. కమ్మిన్స్ ఇండియా- రూ. 4400
కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆఫర్లను పెంచడం ద్వారా కేకేసీ బాగా రాణిస్తోందని బ్రోకరేజ్ తెలిపింది. రాబోయే కాలంలో పంపిణీ వ్యాపారాన్ని పెంచడానికి గణనీయమైన అవకాశం ఉందని కోటాక్ అభిప్రాయపడింది. ఎఫ్వై26-28 మధ్య 14-15% సీఏజీఆర్ (వార్షిక సమ్మేళన వృద్ధి రేటు)తో ఆదాయం/ఎబిట్డా/ప్యాట్ నమోదు చేస్తుందని అంచనా వేసింది.
4. ఎటర్నల్- టార్గెట్ రూ. 375
బ్లింకిట్ టేక్ రేట్లో విస్తరణకు అవకాశం ఉందని కోటాక్ నమ్ముతోంది. పాత స్టోర్ల అధిక నిష్పత్తి ఆపరేటింగ్ లెవరేజ్ను పెంచుతుందని అంచనా. బ్లింకిట్ 2026 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (హెచ్2ఎఫ్వై26) ఎబిట్డా బ్రేక ఈవెన్ సాధిస్తుందని బ్రోకరేజ్ ఆశిస్తోంది. ఎఫ్వై25-28ఈ మధ్య 83% సీఏజీఆర్ కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఎటర్నల్ అందిస్తుందని కోటక్ అంచనా వేస్తోంది.
5. ఐసీఐసీఐ బ్యాంక్- టార్గెట్ రూ. 1700
18% రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్ఓఈ) తో ఐసీఐసీఐ బ్యాంక్ దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటని కోటాక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అన్ని విభాగాలలో బలమైన పీబీటీ (లాభం) పనితీరును నమోదు చేసింది. అసురక్షిత రుణాల పోర్ట్ఫోలియోలో ఎటువంటి ఒత్తిడి కనిపించడం లేదని, రుణ వృద్ధి విస్తృత మరియు గ్రాన్యులర్గా ఉందని కోటక్ తెలిపింది.
6. మహీంద్రా అండ్ మహీంద్రా- టార్గెట్ రూ. 4000
M&M బాగా పనిచేస్తోందని, అన్ని 3 విభాగాలలో అగ్ర స్థానాన్ని కొనసాగిస్తుందని కోటాక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ట్రాక్టర్ విభాగంలో వాల్యూమ్ వృద్ధి ఊపందుకోవడం కొనసాగుతుందని కోటక్ అంచనా వేస్తోంది. అలాగే, ఎస్యూవీ విభాగంలో ఎఫ్వై26ఈలో వాల్యూమ్స్ మిడ్-హై టీన్స్ ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి చెందుతాయని భావిస్తోంది. ఎల్సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్) విభాగంలో డిమాండ్ ఊపందుకోవడం, ఎల్సీవీ- ట్రాక్టర్ విభాగాలలో లాభదాయకత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు.
7. రిలయన్స్ ఇండస్ట్రీస్- టార్గెట్ రూ. 1555
ఆర్ఐఎల్ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ఎబిట్డాను రెట్టింపు చేసి రూ. 2,11,100 కోట్లకు పెంచాలని యోచిస్తోంది. రిలయన్స్ టెలికాం వ్యాపారం జియో ఐపీఓ 2026 క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారతీయ స్టాక్ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. రిటైల్ వ్యాపారం వచ్చే మూడేళ్లలో 20%+ ఆదాయ సీఏజీఆర్ సాధిస్తుందని అంచనా.
ఈ షేర్ ప్రైజ్ టార్గెట్లు 1 ఏడాది కాలానికి అని గుర్తుపెట్టుకోవాలి.
(గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించాల్సి ఉంటుంది.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


