ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 20, సోమవారం నాడు జరుపుకుంటున్నారు. అయితే, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రతీ ఏటా శుభప్రదమైన ముహురత్ ట్రేడింగ్ సెషన్ మాత్రం దీపావళి రోజున ఉండదు.

నిజానికి, అక్టోబర్ 20, సోమవారం నాడు దళాల్ స్ట్రీట్ (స్టాక్ మార్కెట్) యథావిధిగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు సాధారణ ట్రేడింగ్కు తెరిచే ఉంటుంది. ఆ తర్వాత, అక్టోబర్ 21, మంగళవారం నాడు మాత్రమే ఈ ముహురత్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.
ముహురత్ ట్రేడింగ్ 2025: సమయం, తేదీ, ఇతర వివరాలు..
ఎక్స్ఛేంజీల నుంచి అందిన సర్క్యులర్ ప్రకారం, ముహురత్ ట్రేడింగ్ అక్టోబర్ 20, సోమవారం కాకుండా, అక్టోబర్ 21, మంగళవారం నాడు జరగనుంది. ఆ రోజున, గంటపాటు జరిగే ట్రేడింగ్ సెషన్ మినహా ఇండియన్ స్టాక్ మార్కెట్ పూర్తిగా మూసివేసి ఉంటుంది.
సాధారణంగా ముహురత్ ట్రేడింగ్ సాయంత్రం వేళల్లో జరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది ఆ ట్రెండ్కు భిన్నంగా, ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు జరగనుంది.
సర్క్యులర్ ప్రకారం, ముందుగా 15 నిమిషాల ప్రీ-ఓపెన్ సెషన్ మధ్యాహ్నం 1:30 నుంచి 1:45 వరకు ఉంటుంది. ఆ తర్వాత సాధారణ ట్రేడింగ్ సెషన్ మొదలవుతుంది.
మరోవైపు దీపావళి బలిప్రతిపద సందర్భంగా అక్టోబర్ 22, బుధవారం నాడు కూడా ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ఉంటుంది!
అసలు ముహురత్ ట్రేడింగ్ అంటే ఏమిటి?
ముహురత్ ట్రేడింగ్ అనేది ఒక సాధారణ ట్రేడింగ్ రోజు మాదిరిగానే పూర్తి నియమాలతో నిర్వహించే ఒక ప్రత్యేకమైన, గంటపాటు జరిగే సెషన్.
దీపావళి పండుగ కొత్త సంవత్సరాన్ని (సంవత్) సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం శుభసూచకంగా భావించి, పెట్టుబడిదారులు తరచుగా ఈ టోకెన్ ట్రేడింగ్ సెషన్లో పాల్గొంటారు. ముహురత్ ట్రేడింగ్ సమయంలో ట్రేడింగ్ వాల్యూమ్స్ సాధారణంగా తక్కువగా ఉంటాయి.
అనేక మంది పెట్టుబడిదారులు ఈ రోజున దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్స్ని చేస్తుంటారు.
ముహురత్ ట్రేడింగ్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది?
{{/usCountry}}అనేక మంది పెట్టుబడిదారులు ఈ రోజున దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్స్ని చేస్తుంటారు.
ముహురత్ ట్రేడింగ్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది?
{{/usCountry}}హిస్టరీని చూస్తే, గత ఐదు ముహురత్ ట్రేడింగ్ సెషన్లలో (2020–2024), నిఫ్టీ50 స్థిరంగా పాజిటివ్లో ముగిసింది. ప్రతి సందర్భంలోనూ 0.40% నుంచి 0.90% పరిధిలో లాభాలను నమోదు చేసింది.
ఈ సంవత్సరం కూడా, అనుకూలమైన టెక్నికల్ ఇండికేటర్లు, మెరుగుపడుతున్న ఫండమెంటల్స్ కలగలిసి, మార్కెట్ సెంటిమెంట్ ఆశాజనకంగా ఉంది.
ముహురత్ ట్రేడింగ్ వ్యూహం..
"నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించే వ్యక్తులకు జీరో ఆదాయపు పన్ను, నాలుగు-శ్రేణుల జీఎస్టీ నిర్మాణాన్ని రెండు ప్రధాన శ్లాబ్లుగా హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, దేశీయ వినియోగాన్ని ఉత్తేజపరిచే దిశగా ప్రభుత్వ విధానం బలంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి," అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ ఏవీపీ, విష్ణు కాంత్ ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.
"దీని ఫలితంగా, కన్జ్యూమర్-ఆధారిత స్టాక్లపై దృష్టి పెట్టొచ్చు," అని ఆయన తెలిపారు.
టెక్నికల్స్ని చూస్తే, నిఫ్టీ 50 విస్తృత దృక్పథం నిర్మాణాత్మకంగా ఉందని, అందువల్ల "బై ఆన్ డిప్స్" అనే వ్యూహం ప్రబలంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 25000–24800 జోన్ వైపు ఏదైనా దిద్దుబాటు వస్తే, తాజా లాంగ్ పొజిషన్లను ప్రారంభించడానికి ఇది ఒక అవకాశాన్ని అందిస్తుంది. ప్రారంభ అప్సైడ్ టార్గెట్లు 25650–25700 స్థాయిల వద్ద ఉండవచ్చని కాంత్ సలహా ఇచ్చారు.