నీట్ పేపర్ లీక్ వివాదం పార్లమెంట్ను, ఢిల్లీ వీధులను ఊపేస్తోంది. బుధవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు నీట్ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతున్నప్పటికీ, అడ్జర్న్మెంట్ మోషన్ ద్వారానే సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్షాలు స్పష్టం చేయడంతో పార్లమెంట్లో స్థంబన కొనసాగుతోంది.

మరోవైపు, జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP), కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో చర్చలకు రావాలన్న పోలీసుల ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరించింది.
వాయిదా తీర్మానానికి ప్రతిపక్షాల పట్టు
నీట్ పేపర్ లీక్పై ప్రాధాన్యత ఇచ్చి అడ్జర్న్మెంట్ మోషన్ కిందే చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. "మేము చర్చకు వ్యతిరేకం కాదు, అయితే వాయిదా తీర్మానం ద్వారా చర్చ జరిగితేనే ఈ సున్నితమైన అంశంపై పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం లభిస్తుంది. 'వందేమాతరం'పై చర్చించేందుకు ఎనిమిది గంటల సమయం కేటాయించిన ప్రభుత్వం.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ వివాదంపై సమయం కేటాయించలేదా? ప్రభుత్వం సమస్యను పరిష్కరించేందుకు బదులు రాజకీయ క్రీడలు ఆడుతోంది" అని ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అదే సమయంలో, ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్సభలో డిమాండ్ చేశారు.
చర్చకు సిద్ధమేనన్న కేంద్ర ప్రభుత్వం
ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. పార్లమెంట్ సక్రమంగా సాగితే నీట్ అంశంపై ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. "గత మూడు రోజులుగా నీట్ పేపర్ లీక్పై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. దేశ యువత భవిష్యత్తుపై అర్థవంతమైన చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది" అని కిరణ్ రిజిజు వివరించారు.
రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రతిపక్షాల వైఖరిని తప్పుపట్టారు. 'ఇండియా' కూటమి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, నీట్ వ్యవహారంపై సమగ్ర చర్చకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
'ఎవరి ఇంటికీ వెళ్లేది లేదు'.. సీజేపీ స్పష్టీకరణ
{{/usCountry}}రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రతిపక్షాల వైఖరిని తప్పుపట్టారు. 'ఇండియా' కూటమి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, నీట్ వ్యవహారంపై సమగ్ర చర్చకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
'ఎవరి ఇంటికీ వెళ్లేది లేదు'.. సీజేపీ స్పష్టీకరణ
{{/usCountry}}కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి వచ్చి మాట్లాడాలని పోలీసులు కోరినప్పటికీ, ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. "మంత్రి జేపీ నడ్డా మాట్లాడాలనుకుంటున్నారని ఉదయం పోలీసులు మాకు సమాచారం ఇచ్చారు. ఆయన నివాసానికి రావాలని కోరగా మేం తిరస్కరించాం. మేము ఎవరి ఇళ్లకు లేదా ఆఫీసులకు వెళ్లేది లేదు. జంతర్ మంతర్ వద్ద ప్రజా దర్బార్ జరుగుతోంది, మంత్రులే ఇక్కడికి వచ్చి ప్రజలతో మాట్లాడాలి. సెక్యూరిటీ సమస్యలు ఉంటే జంతర్ మంతర్ సమీపంలోని ఏదైనా తటస్థ ప్రదేశంలో భేటీకి సిద్ధంగా ఉన్నాం" అని సౌరవ్ దాస్ తెలిపారు.
విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో, భద్రతను పర్యవేక్షించడానికి పశ్చిమ బెంగాల్ నుంచి అదనంగా 20 సిఆర్పిఎఫ్ (CRPF) కంపెనీలను ఢిల్లీకి తరలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.