...
...
Next Story

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆదాయంలో 29% వృద్ధి.. ఇక బ్లేడ్ బ్యాటరీ బస్సుల ఉత్పత్తి

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OGL) మూడో త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను సాధించింది. అలాగే ఒకే త్రైమాసికంలో 385 వాహనాలను డెలివరీ చేసి కొత్త రికార్డు సృష్టించింది. త్వరలో 'బ్లేడ్ బ్యాటరీ' సాంకేతికతతో కూడిన బస్సుల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Published on: Feb 03, 2026 02:04 PM IST
Advertisement

హైదరాబాద్‌కు చెందిన ఎంఈఐఎల్ (MEIL) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్, ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో డిసెంబర్ 31, 2025తో ముగిసిన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను సంస్థ ఆమోదించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు పలు కీలక ప్రకటనలు చేశారు.

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆదాయంలో 29% వృద్ధి.. ఇక బ్లేడ్ బ్యాటరీ బస్సుల ఉత్పత్తి
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆదాయంలో 29% వృద్ధి.. ఇక బ్లేడ్ బ్యాటరీ బస్సుల ఉత్పత్తి

సాంకేతిక విప్లవం: బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ భారత ఎలక్ట్రిక్ బస్సుల రంగంలోనే తొలిసారిగా ఒలెక్ట్రా అభివృద్ధి చేసిన 'బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌'కు సర్టిఫికేషన్ లభించింది. "ఈ టెక్నాలజీ మా వృద్ధి వ్యూహంలో కీలక మైలురాయి. వచ్చే త్రైమాసికం నుంచే బ్లేడ్ బ్యాటరీతో కూడిన కొత్త బస్సుల ఉత్పత్తిని ప్రారంభిస్తాం" అని మహేష్ బాబు వెల్లడించారు. ఈ సాంకేతికత వల్ల బస్సులు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఆర్థిక ఫలితాల హైలైట్స్ (Q3 FY26):

  • ఆదాయం: గత ఏడాదితో పోలిస్తే 29 శాతం పెరిగి రూ. 663.60 కోట్లకు చేరింది.
  • నికర లాభం: ఈ త్రైమాసికంలో రూ. 46.68 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
  • రికార్డు డెలివరీలు: గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే త్రైమాసికంలో 385 ఎలక్ట్రిక్ వాహనాలను (37% వృద్ధి) డెలివరీ చేసింది. ఇందులో 24 ఎలక్ట్రిక్ టిప్పర్లు కూడా ఉన్నాయి.
  • ఆర్డర్ బుక్: ప్రస్తుతం సంస్థ వద్ద 9,439 ఎలక్ట్రిక్ వాహనాల భారీ ఆర్డర్లు ఉన్నాయి. ఇది భవిష్యత్తులో కంపెనీ ఆదాయానికి గట్టి భరోసా ఇస్తోంది.
  • తొమ్మిది నెలల పనితీరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఒలెక్ట్రా రూ. 1,667.45 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23 శాతం ఎక్కువ. నికర లాభం రూ. 122.14 కోట్లుగా నమోదై స్థిరమైన వృద్ధిని కనబరిచింది.
  • విస్తరిస్తున్న ఉనికి: కేవలం బస్సులకే పరిమితం కాకుండా, ఎలక్ట్రిక్ టిప్పర్ల విభాగంలోనూ ఒలెక్ట్రా వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు సంస్థ మొత్తం 3,639 ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తెచ్చింది. కార్యనిర్వహణ సామర్థ్యం పెరగడం వల్లే లాభాల్లో ఈ స్థాయి వృద్ధి సాధ్యమైందని మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe