జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన సతీమణి పాయల్ అబ్దుల్లాల వైవాహిక వివాదానికి తెరపడింది. ఇరు వర్గాలు సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకోవడంతో సుప్రీంకోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ కేసును ముగించింది.
మధ్యవర్తిత్వంతో లభించిన పరిష్కారం

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఒమర్ అబ్దుల్లా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, ఇరుపక్షాల మధ్య సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు.
"ఇరువర్గాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకుని స్వేచ్ఛను కోరుకున్నాయి. అన్ని విషయాలపైనా ఒప్పందం కుదిరింది. విడాకులు మంజూరు చేస్తారని కోరుతున్నాం. ఇతర పెండింగ్ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటాం" అని కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు.
ఈ ప్రతిపాదనపై స్పందించిన న్యాయమూర్తులు, "చాలా మంచిది, ఒప్పంద నిబంధనల ప్రకారమే కేసును పరిష్కరిస్తున్నాం" అని పేర్కొంటూ విడాకుల డిక్రీ మంజూరు చేశారు.
ఒక దశాబ్దానికి పైగా కోర్టు పోరాటం
ఒమర్ అబ్దుల్లా, పాయల్లకు 1994 సెప్టెంబర్లో వివాహమైంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వీరు చాలా కాలంగా విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు కోరుతూ ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్ను 2016లో ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 2023 డిసెంబర్ 12న ఢిల్లీ హైకోర్టు కూడా ఒమర్ పిటిషన్ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థించింది. శారీరక లేదా మానసిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు చూపలేకపోయారని హైకోర్టు పేర్కొంది.
అంతకుముందు, 2023 ఆగస్టులో ఢిల్లీ హైకోర్టు పాయల్కు నెలకు రూ.1.5 లక్షల మధ్యంతర జీవనభృతి చెల్లించాలని ఒమర్ అబ్దుల్లాను ఆదేశించింది. దాంతోపాటు లా చదువుతున్న వారి ఇద్దరు కుమారుల చదువుల కోసం ఒక్కొక్కరికి నెలకు రూ.60,000 చొప్పున ఇవ్వాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు చొరవతో ముగింపు
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, గతేడాది ఏప్రిల్లో కీలక సూచన చేసింది. ఇద్దరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుని, మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించింది.
{{/usCountry}}ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, గతేడాది ఏప్రిల్లో కీలక సూచన చేసింది. ఇద్దరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుని, మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించింది.
{{/usCountry}}న్యాయస్థానం ఇచ్చిన సలహాతో ఇరువర్గాలు చర్చలు జరిపి వివాదాలన్నింటికీ ముగింపు పలికాయి. శుక్రవారం సుప్రీంకోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేయడంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది.