రాజ్యసభ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత రాఘవ్ చడ్డాతో పాటు అదే పార్టీకే చెందిన మరో ఆరుగురు ఎంపీలు బీజేపీలో విలీనం కావడానికి రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ పచ్చజెండా ఊపారు. గత వారమే ఆప్ నుంచి బయటకు వచ్చిన ఈ రెబల్ ఎంపీలు, ఇప్పుడు అధికారికంగా కమలం గూటికి చేరారు. దీంతో 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ బలం 113కి పెరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి కీలక బిల్లుల ఆమోదం సమయంలో పెద్ద ఊరటనిచ్చే అంశం.
బీజేపీలో కలిసిన ఆప్ రెబల్స్

బీజేపీలోకి వెళ్లిన వారిలో రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, విక్రమ్జిత్ సింగ్ సహానీ, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేందర్ గుప్త ఉన్నారు. ఈ ఏడుగురు సభ్యుల పేర్లు ఇప్పుడు రాజ్యసభ అధికారిక జాబితాలో బీజేపీ ఎంపీలుగా నమోదయ్యాయి. ఈ పరిణామంతో ఎగువ సభలో ఆప్ బలం కేవలం మూడుకు పడిపోయింది. పంజాబ్ నుంచి ఎంపికైన ఏడుగురు ఎంపీలలో ఆరుగురు పార్టీని వీడటంతో, అక్కడ ఇప్పుడు బల్బీర్ సింగ్ సీచెవాల్ ఒక్కరే ఆప్ తరపున మిగిలారు.
కిరణ్ రిజిజు హర్షం
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ విలీనాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణానికి సిద్ధమైన ఎన్డీయే కూటమిలోకి మీకు సాదర స్వాగతం. 'టుక్డే-టుక్డే' ఇండి కూటమికి ఇక వీడ్కోలు" అంటూ ఆయన ఆప్పై విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా, బీజేపీలోకి చేరిన ఈ ఏడుగురు ఎంపీలు ఎప్పుడూ అసభ్య పదజాలం వాడలేదని, పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని ఆయన కొనియాడారు. వారి క్రమశిక్షణే వారిని బీజేపీ వైపు నడిపించిందని రిజిజు అభిప్రాయపడ్డారు.
'టాక్సిక్' వాతావరణమే కారణం: రాఘవ్ చడ్డా
పార్టీని వీడటానికి గల కారణాలను వివరిస్తూ రాఘవ్ చడ్డా ఒక వీడియోను విడుదల చేశారు. తన 15 ఏళ్ల యవ్వనాన్ని ఈ పార్టీ కోసం ధారపోశానని, కానీ ఇప్పుడు ఆప్ మునుపటిలా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పార్లమెంటులో మాట్లాడాలన్నా, ప్రజల కోసం పనిచేయాలన్నా కొందరు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పార్టీ కొందరు అవినీతి వ్యక్తుల చేతుల్లో బందీ అయింది. నేను సరైన వ్యక్తినే కానీ, తప్పుడు పార్టీలో ఉన్నానని అనిపించింది" అని చడ్డా పేర్కొన్నారు. పనిచేసే చోట వాతావరణం కలుషితమైతే (Toxic) ఎవరైనా బయటకు రాక తప్పదని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
పంజాబ్ రాజకీయాలపై ప్రభావం
{{/usCountry}}పార్టీని వీడటానికి గల కారణాలను వివరిస్తూ రాఘవ్ చడ్డా ఒక వీడియోను విడుదల చేశారు. తన 15 ఏళ్ల యవ్వనాన్ని ఈ పార్టీ కోసం ధారపోశానని, కానీ ఇప్పుడు ఆప్ మునుపటిలా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పార్లమెంటులో మాట్లాడాలన్నా, ప్రజల కోసం పనిచేయాలన్నా కొందరు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పార్టీ కొందరు అవినీతి వ్యక్తుల చేతుల్లో బందీ అయింది. నేను సరైన వ్యక్తినే కానీ, తప్పుడు పార్టీలో ఉన్నానని అనిపించింది" అని చడ్డా పేర్కొన్నారు. పనిచేసే చోట వాతావరణం కలుషితమైతే (Toxic) ఎవరైనా బయటకు రాక తప్పదని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
పంజాబ్ రాజకీయాలపై ప్రభావం
{{/usCountry}}ఈ ఎంపీల మార్పు కేవలం రాజ్యసభకే పరిమితం కాకుండా పంజాబ్ రాజకీయాల్లోనూ చిచ్చు రేపనుంది. పంజాబ్ నుంచి అత్యధిక స్థానాలు గెలిచిన ఆప్, ఇప్పుడు తన ఎంపీలను కాపాడుకోలేకపోవడం పార్టీ నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతోంది. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ స్వాతి మలివాల్ వంటి ప్రముఖులు బీజేపీ వైపు వెళ్లడం ఆప్కు కోలుకోలేని దెబ్బ. దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్కు తన సొంత ఎంపీలే షాక్ ఇవ్వడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.