టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ లో ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలు క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న ఇండియాకు మరింత షాకిచ్చే వార్త ఇది. టీమ్ కష్టాలు డబుల్ చేస్తూ డేంజరస్ బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడాడు. ఈ స్టార్ బ్యాటర్ చెన్నై నుంచి డైరెక్ట్ గా యూపీ వెళ్లిపోయాడు. గురువారం జింబాబ్వేతో మ్యాచ్ లో అతను ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటికి రింకు సింగ్

భారత జట్టు మిడిల్-ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ ఇంటికి వెళ్లిపోయాడు. చెన్నైలో టీమ్ తో ఉన్న అతను హుటాహుటిన యూపీ బయల్దేరాడు. రింకు సింగ్ తండ్రి ఖాంచంద్ సింగ్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడమే ఇందుకు కారణం. ఫోర్త్ స్టేజీ క్యాన్సర్ తో పోరాడుతున్న రింకు సింగ్ తండ్రి ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలిసింది.
తండ్రి కోసం
క్యాన్సర్ తో పోరాడుతున్న తండ్రి పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉండటంతో రింకు సింగ్ టీమ్ ను వీడాల్సి వచ్చింది. పీటీఐ ప్రకారం రింకు సింగ్ తండ్రి ఖాంచంద్ సింగ్ ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్పిటల్ లో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. "ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా రింకు సింగ్ చెన్నై నుంచి ఇంటికి వెళ్లాడు. చెపాక్ లో ప్రాక్టీస్ సెషన్ కు అతను అటెండ్ కాలేదు’’ అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపాడు.
మ్యాచ్ ఆడేనా?
గురువారం (ఫిబ్రవరి 26) చెపాక్ లో జింబాబ్వేతో భారత్ మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో తన ఫస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తయింది. ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే జింబాబ్వేపై భారీ విజయం సాధించాల్సిందే. ఈ పరిస్థితుల్లో విధ్వంసక బ్యాటర్ రింకు సింగ్ టీమ్ ను వీడటం టెన్షన్ కలిగించేదే. మరి ఈ మ్యాచ్ వరకు అతను తిరిగి టీమ్ తో కలుస్తాడా? లేదా? అన్నది చూడాలి.
రింకు రన్స్
టీ20 ప్రపంచకప్ 2026 లో రింకు సింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా లేదు. అయిదు ఇన్నింగ్స్ ల్లో అతను 24 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు సూపర్ 8 పోరులో ఇండియా పరిస్థితి డూ ఆర్ డైగా మారింది. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి భారత్ ను దెెబ్బకొట్టింది. ప్రస్తుతం గ్రూప్ లో వెస్టిండీస్ (+5.350 NRR), దక్షిణాఫ్రికా (+3.800 NRR) తర్వాత ఇండియా (-3.800) మూడో స్థానంలో ఉంది. గ్రూప్ మ్యాచ్ లన్నీ ముగిసిన తర్వాత టాప్ 2లో ఉండే టీమ్స్ సెమీస్ కు క్వాలిఫై అవుతాయి.
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ 2026 లో రింకు సింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా లేదు. అయిదు ఇన్నింగ్స్ ల్లో అతను 24 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు సూపర్ 8 పోరులో ఇండియా పరిస్థితి డూ ఆర్ డైగా మారింది. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి భారత్ ను దెెబ్బకొట్టింది. ప్రస్తుతం గ్రూప్ లో వెస్టిండీస్ (+5.350 NRR), దక్షిణాఫ్రికా (+3.800 NRR) తర్వాత ఇండియా (-3.800) మూడో స్థానంలో ఉంది. గ్రూప్ మ్యాచ్ లన్నీ ముగిసిన తర్వాత టాప్ 2లో ఉండే టీమ్స్ సెమీస్ కు క్వాలిఫై అవుతాయి.
{{/usCountry}}