...
...
Next Story

ఎస్బీఐలో 7,680 క్లర్క్ ఉద్యోగాలు: నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేసుకోండిలా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 7,680 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31 వరకు sbi.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Aug 12, 2026, 14:25:27 IST
Advertisement

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో 7,680 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఎస్బీఐలో 7,680 క్లర్క్ ఉద్యోగాలు: నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేసుకోండిలా
ఎస్బీఐలో 7,680 క్లర్క్ ఉద్యోగాలు: నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేసుకోండిలా

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులు ఆగస్టు 11న ప్రారంభమయ్యాయి. చివరి తేదీ ఆగస్టు 31, 2026గా నిర్ణయించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, సెప్టెంబర్ 2026లో ప్రిలిమినరీ పరీక్ష, నవంబర్ 2026లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

అర్హతలు, వయోపరిమితి

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) కోర్సు చేసినవారు డిసెంబర్ 31, 2026 నాటికి ఉత్తీర్ణులై ఉండాలి.

ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1998 కంటే ముందు, ఏప్రిల్ 1, 2006 తర్వాత జన్మించిన వారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్స్), స్థానిక భాషా పరీక్ష (Specified Local Language Test) ద్వారా ఎంపిక చేస్తారు.

ప్రిలిమ్స్ పరీక్ష తీరు: ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 1 గంట. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనే మూడు విభాగాలు ఉంటాయి.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (General/OBC/EWS) కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 750 గా నిర్ణయించారు. ఒకసారి చెల్లించిన రుసుమును ఎట్టి పరిస్థితుల్లోనూ రీఫండ్ చేయరు.

దరఖాస్తు చేసుకునే విధానం

  • ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in సందర్శించండి.
  • హోమ్‌పేజీలో ఉన్న 'Careers' విభాగంలోకి వెళ్లి, 'Junior Associate' రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ వివరాలతో మొదటిసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి.
  • దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.
  • పూర్తి చేసిన దరఖాస్తు కాపీని భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి ఉంచుకోండి.

సమగ్ర నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేసేందుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe