SBI Clerk Prelims ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి..
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025 త్వరలో విడుదలకానున్నాయి! ఫలితాల్ని ఎలా చెక్ చేసుకోవాలి? ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, తదుపరి ప్రక్రియ ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2025 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. ఫలితాలు విడుదలైన వెంటనే, బ్యాంక్ అధికారిక వెబ్సైట్ sbi.bank.in లో వాటిని చూసుకుని, డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు వెళతారు. ఆ తర్వాత వారికి ‘భాషా ప్రావీణ్యత పరీక్ష’ నిర్వహిస్తారు. అయితే, అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్య విషయం.. తుది ఎంపిక కోసం మెరిట్ జాబితాను కేవలం మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తయారు చేస్తారు!
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2025: ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
అభ్యర్థులు తమ ప్రిలిమ్స్ ఫలితాన్ని సులభంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
స్టెప్ 1- ముందుగా, ఎస్బీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ sbi.bank.in ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్పేజీలో ఉన్న “కెరీర్స్” విభాగానికి వెళ్లండి.
స్టెప్ 3- అక్కడ, “జూనియర్ అసోసియేట్”, "2025-26" సంవత్సర ఎంపికను ఎంచుకోండి.
స్టెప్ 4- ప్రిలిమ్స్ ఫలితానికి సంబంధించిన లింక్ కనబడుతుంది. ఆ లింక్పై క్లిక్ చేయండి.
స్టెప్ 5- తర్వాత వచ్చే లాగిన్ పేజీలో మీ రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 6- “సబ్మిట్”పై క్లిక్ చేయగానే మీ ప్రిలిమ్స్ ఫలితం స్క్రీన్పై కనిపిస్తుంది.
స్టెప్ 7- ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం దాన్ని సేవ్ చేసి ఉంచుకోండి లేదా ప్రింట్ తీసుకోండి.
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాల తేదీ..
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది! కాబట్టి, తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండాలని సూచించారు.
ఎస్బీఐ జూనియర్ అసోసియేట్: ఖాళీల వివరాలు..
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను వివిధ కేటగిరీల వారీగా ఈ విధంగా విభజించారు:
జనరల్ కేటగిరీ: 2,225 పోస్టులు
ఎస్సీ: 788 పోస్టులు
ఎస్టీ: 450 పోస్టులు
ఓబీసీ: 1,179 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 508 పోస్టులు
పరీక్ష వివరాలు..
ప్రిలిమ్స్ పరీక్ష: ఇది ఆన్లైన్లో 100 మార్కులకు నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష: ఇది 200 మార్కులకు, 2 గంటల 40 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది.
భాషా ప్రావీణ్యత పరీక్ష (ఎల్పీటీ): మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు, వారు దరఖాస్తు చేసుకున్న ప్రాంతీయ/స్థానిక భాషలో వారికి ఉన్న ప్రావీణ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


