నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 944 పాయింట్లు (1.17%) లాభపడి 81,666.46 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 50 సూచీ 263 పాయింట్లు (1.06%) పెరిగి 25,088.40 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే ముగిశాయి. బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.450.6 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు చేరింది.

నేటి మార్కెట్ విశేషాలు: ఈ 10 పాయింట్లు గమనించండి
1. మార్కెట్ అకస్మాత్తుగా ఎందుకు పుంజుకుంది?
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంపు వంటి అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం వృద్ధిపై చూపుతున్న శ్రద్ధను ఇన్వెస్టర్లు సానుకూలంగా తీసుకున్నారు. "బడ్జెట్లో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటు వృద్ధికి పెద్దపీట వేయడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచింది" అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 42 పైసలు బలపడి 91.51కి చేరడం మార్కెట్కు కలిసొచ్చింది.
2. టాప్ గెయినర్స్
(నిఫ్టీ 50) నిఫ్టీలో దాదాపు 39 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. వీటిలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (7.42%), టాటా మోటార్స్ (5.61%), అదానీ పోర్ట్స్ (4.28%) అగ్రస్థానంలో నిలిచాయి.
3. నష్టపోయిన షేర్లు
శ్రీరామ్ ఫైనాన్స్ (-3.17%), యాక్సిస్ బ్యాంక్ (-2.33%), మాక్స్ హెల్త్కేర్ (-1.82%) నష్టాలను చవిచూశాయి.
4. రంగాల వారీగా..
ఐటీ, హెల్త్కేర్ మినహా మిగిలిన అన్ని రంగాలు లాభపడ్డాయి. ముఖ్యంగా ఆటో (2.13%), ఆయిల్ అండ్ గ్యాస్ (2.04%), మెటల్ (1.88%) రంగాలు మార్కెట్ను నడిపించాయి. బ్యాంక్ నిఫ్టీ 0.35% లాభంతో 58,619 వద్ద ముగిసింది.
5. జోరుగా ట్రేడ్ అయిన షేర్లు
వాల్యూమ్ పరంగా వొడాఫోన్ ఐడియా (69.3 కోట్ల షేర్లు), టాటా సిల్వర్ ఈటీఎఫ్, టాటా గోల్డ్ ఈటీఎఫ్ కౌంటర్లు అత్యంత యాక్టివ్గా ఉన్నాయి.
6. అడ్వాన్స్-డిక్లైన్ రేషియో
{{/usCountry}}వాల్యూమ్ పరంగా వొడాఫోన్ ఐడియా (69.3 కోట్ల షేర్లు), టాటా సిల్వర్ ఈటీఎఫ్, టాటా గోల్డ్ ఈటీఎఫ్ కౌంటర్లు అత్యంత యాక్టివ్గా ఉన్నాయి.
6. అడ్వాన్స్-డిక్లైన్ రేషియో
{{/usCountry}}మార్కెట్ పెరిగినప్పటికీ, అమ్మకాల ఒత్తిడి ఇంకా తగ్గలేదని అర్థమవుతోంది. బిఎస్ఈలో 2,200 షేర్లు నష్టాల్లో ఉండగా, 2,000 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.
7. 15% కంటే పైగా పెరిగిన స్టాక్స్
బయోఫిల్ కెమికల్స్, యునైటెడ్ ఫుడ్ బ్రాండ్స్, దిగ్గీ మల్టీట్రేడ్ సహా 14 షేర్లు 15 శాతానికి పైగా అప్పర్ సర్క్యూట్ తాకాయి.
8. 52 వారాల గరిష్టానికి..
ఏథర్ ఇండస్ట్రీస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సహా సుమారు 76 షేర్లు ఏడాది కాలపు గరిష్ట స్థాయిని తాకాయి.
9. షాకిచ్చిన దిగ్గజాలు - 52 వారాల కనిష్టానికి
మార్కెట్ లాభాల్లో ఉన్నప్పటికీ.. ఐటీసీ (ITC), బజాజ్ హోల్డింగ్స్, హావెల్స్ ఇండియా, ట్రెండ్ వంటి దాదాపు 360 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం గమనార్హం.
10. నిపుణుల టెక్నికల్ వ్యూ
నిఫ్టీకి 24,930 - 24,900 వద్ద తక్షణ సపోర్ట్ ఉందని ఎస్బిఐ సెక్యూరిటీస్ నిపుణుడు సుదీప్ షా తెలిపారు. పైకి వెళ్తే 25,170 - 25,200 మధ్య అడ్డంకి (Resistance) ఎదురుకావచ్చు. ఒకవేళ నిఫ్టీ 25,200 పైన నిలకడగా కొనసాగితే, స్వల్ప కాలంలో 25,350 వరకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
(గమనిక: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)