న్యూజిలాండ్తో జరగనున్న రాబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయాల కారణంగా యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ సిరీస్కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్లను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
తిలక్ వర్మకు పొత్తికడుపులో నొప్పి

హైదరాబాద్ యువ సంచలనం తిలక్ వర్మకు విజయ్ హజారే ట్రోఫీ ట్రైనింగ్ సెషన్లో పొత్తికడుపులో అసౌకర్యం తలెత్తింది. దీంతో అతడు న్యూజిలాండ్తో జరగనున్న మొదటి మూడు టీ20లకు దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులో చేరాడు.
సుందర్కు పక్కటెముకల గాయం..
మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, వడోదర వేదికగా జనవరి 11న న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. స్కానింగ్ రిపోర్టులో అతనికి పక్కటెముకల గాయం అయినట్లు తేలింది. దీంతో సుందర్ కేవలం వన్డే సిరీస్కే కాకుండా, టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
అంతకుముందు వన్డే సిరీస్లో సుందర్ స్థానాన్ని ఆయుష్ బదోనితో భర్తీ చేయగా.. ఇప్పుడు టీ20 సిరీస్ కోసం రవి బిష్ణోయ్ను జట్టులోకి తీసుకున్నారు. సుందర్కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని, ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి రిపోర్ట్ చేయాలని బీసీసీఐ సూచించింది.
ప్రస్తుతం ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో రెండు టీమ్స్ చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. మూడో వన్డే జనవరి 18న జరగనుంది. ఐదు టీ20ల సిరీస్ జనవరి 21 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది.
టీ20 సిరీస్కు టీమిండియా ఇలా..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి 3 మ్యాచ్లకు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.
{{/usCountry}}సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి 3 మ్యాచ్లకు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.
{{/usCountry}}