Stock Market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 131 స్టాక్తో లాభాలకు ఛాన్స్!
Stocks to buy today : ఆగస్టు 10, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు ముడి చమురు ధర, లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు పడి 78,491 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 65 పాయింట్లు కోల్పోయి 24,571 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 317 పాయింట్లు పడి 57,746 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 480.24 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 235.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో వీక్నెస్ కనిపిస్తోంది. 24,400- 24,300 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,700 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.28 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.62శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.3 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితులు కొనసాగుతున్న వేళ ముడి చమురు ధర పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ 1.09శాతం పెరిగి బ్యారెల్కి 84.46 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఫిజిక్స్వాలా- బై రూ. 131.5, స్టాప్ లాస్ రూ. 127, టార్గెట్ రూ. 140
గ్రాసిమ్ ఇండస్ట్రీస్- బై రూ. 3323, స్టాప్ లాస్ రూ. 3200, టార్గెట్ రూ. 3555
ఫోర్టిస్ హెల్త్కేర్- బై రూ. 955, స్టాప్ లాస్ రూ. 920, టార్గెట్ రూ. 1020
బీఈఎంఎల్- బై రూ. 1788, స్టాప్ లాస్ రూ. 1725, టార్గెట్ రూ. 1913
హొనాసా కన్జ్యూమర్- బై రూ. 478, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 512
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


