...
...
Next Story

Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- రిలయన్స్ షేర్ ప్రైజ్ టార్గెట్​ ఇదే..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 3, 2026, 08:31:14 IST
Advertisement

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 374 పాయింట్లు పడి 76,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 141 పాయింట్లు కోల్పోయి 23,914 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 238 పాయింట్లు పడి 57,172 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6,688.37 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,812.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.50 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.46శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.23 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

బ్రెంట్ క్రూడ్ 0.45శాతం పడి బ్యారెల్​కి 95.20 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

మీషో- బై రూ. 212, స్టాప్​ లాస్​ రూ. 204, టార్గెట్​ రూ. 227

ఆంథెమ్ బయోసైన్సెస్- బై రూ. 934, స్టాప్​ లాస్​ రూ. 901, టార్గెట్​ రూ. 999

పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్- బై రూ. 1413, స్టాప్​ లాస్​ రూ. 1380, టార్గెట్​ రూ. 1460

కోల్ ఇండియా- బై రూ. 417, స్టాప్​ లాస్​ రూ. 410, టార్గెట్​ రూ. 430

జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ- బై రూ. 539.80, స్టాప్​ లాస్​ రూ. 528, టార్గెట్​ రూ. 564

క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ- బై రూ. 863, స్టాప్​ లాస్​ రూ. 844, టార్గెట్​ రూ. 910

మార్క్​సాన్స్ ఫార్మా- బై రూ. 332.5, స్టాప్​ లాస్​ రూ. 325, టార్గెట్​ రూ. 350

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe