Stock Market : ట్రేడర్స్​ అలర్ట్- ఎన్​టీపీసీ స్టాక్​కి టైమ్ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్..

Stocks to buy : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 9, 2026, 08:14:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 719 పాయింట్లు పడి 73,524 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 244 పాయింట్లు కోల్పోయి 23,123 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 432 పాయింట్లు పడి 54,064 వద్దకు చేరింది.

లేటెస్ట్​ స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..
లేటెస్ట్​ స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5,555.67 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,165.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50లో వీక్​నెస్​ కనిపిస్తోంది. 23,100 లెవల్స్​ దిగువకు వెళితే సూచీ మరింత బలహీన పడుతుంది. అక్కడి నుంచి 22,700కి వెళ్లొచ్చు. 23,250 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.16 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.3శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.86 శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో చమురు ధర ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతోంది. బ్రెంట్​ క్రూడ్ 0.14శాతం పెరిగి బ్యారెల్​కి 94.38 డాలర్లకు చేరింది.

స్టాక్స్ టు బై టుడే..

కిమ్స్- బై రూ. 801, స్టాప్​ లాస్​ రూ. 772, టార్గెట్​ రూ. 860

జమ్ము అండ్​ కశ్మీర్ బ్యాంక్- బై రూ. 148, స్టాప్​ లాస్​ రూ. 143, టార్గెట్​ రూ. 159

టెక్​ మహీంద్రా- బై రూ. 1503, స్టాప్​ లాస్​ రూ. 1485, టాార్గెట్​ రూ. 1545

ఎన్​టీపీసీ- బై రూ. 362, స్టాప్​ లాస్​ రూ. 354, టార్గెట్​ రూ. 375

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

బజాజ్ కన్జ్యూమర్- బై రూ. 575, స్టాప్​ లాస్​ రూ. 550, టార్గెట్​ రూ. 630

షీలా ఫోమ్- బై రూ. 671, స్టాప్​ లాస్​ రూ .629, టార్గెట్​ రూ. 735

కాప్లిన్ పాయింట్ ల్యాబ్- బై రూ. 2111, స్టాప్​ లాస్​ రూ. 2000, టార్గెట్​ రూ. 2260

ఎస్​జేఎస్ ఎంటర్​ప్రైజెస్- బై రూ. 2061, స్టాప్​ లాస్​ రూ. 1971, టార్గెట్​ రూ. 2200

టాబ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్- బై రూ. 362, స్టాప్​ లాస్​ రూ. 343, టార్గెట్​ రూ. 390

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More