Stock Market : బాబోయ్.. స్టాక్​ మార్కెట్​లకు ఈరోజు కూడా నష్టాలే! లాభాలు చూసేదెప్పుడు?

Stocks to buy : జూన్ 2, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 2, 2026, 08:14:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 508 పాయింట్లు పడి 74,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 165 పాయింట్లు కోల్పోయి 23,383 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 596 పాయింట్లు పడి 53,643 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,911.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,109.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్ భారీ​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 215 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“భారత స్టాక్​ మార్కెట్​లు షార్ట్​ టర్మ్​లో రేంజ్​ బౌండ్​ నుంచి నెగిటివ్​గా ఉండొచ్చు. ఎఫ్​ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయ అనిశ్చితి ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో మిడ్​క్యాప్​ స్పేస్​లో స్టాక్​ స్పెసిఫిక్​గా అవకాశాలను వెతుక్కోవడం ఉత్తమం,” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్​ సర్వీసెస్ హెడ్​ ఆఫ్​ రీసెర్చ్ సిద్ధార్థ ఖేంక తెలిపారు.

చాయిస్​ బ్రోకింగ్​కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా ప్రకారం.. నిఫ్టీ50కి 23,150- 23,200 లెవల్స్​ వద్ద సపోర్ట్​ ఉంది. 23,480- 23,550 వద్ద రెసిస్టెన్స్​ ఉంది.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.09 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.26శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.42 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో చమురు ధర ఫ్లాట్​గా ఉంది. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్​ క్రూడ్ 0.06శాతం పెరిగి 95.04 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై టుడే..

ఎన్​ఎండీసీ- బై రూ. 92.35, స్టాప్​ లాస్​ రూ. 90, టార్గెట్​ రూ. 96

ఐజీఎల్- బై రూ. 164.50, స్టాప్​ లాస్​ రూ. 161, టార్గెట్​ రూ. 171

కొఫోర్జ్- బై రూ. 1461, స్టాప్​ లాస్​ రూ. 1430, టార్గెట్​ రూ. 1515

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

రేట్​గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్- బై రూ. 777, స్టాప్​ లాస్​ రూ. 739, టార్గెట్​ రూ. 845

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 1097, స్టాప్​ లాస్​ రూ. 1042, టార్గెట్​ రూ. 1200

ఎన్​బీసీసీ- బై రూ. 104, స్టాప్​ లాస్​ రూ. 99, టార్గెట్​ రూ. 115

రెడింగ్టన్- బై రూ. 233, స్టాప్​ లాస్​ రూ. 224, టార్గెట్​ రూ. 252

ఎల్​టీఎం- బై రూ. 4196, స్టాప్​ లాస్​ రూ. 4000, టార్గెట్​ రూ. 4550

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More