Stock market : దిగొస్తున్న చమురు ధర- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్తో లాభాలు..!
Stocks to buy today : జులై 28, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 776 పాయింట్లు పెరిగి 76,836 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 228 పాయింట్లు వృద్ధిచెంది 23,996 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 394 పాయింట్లు పెరిగి 57,087 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,688.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,329.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.01 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.02శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.18 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, చర్చల సంకేతాల నేపథ్యంలో ముడి చమురు ధర భారీగా పతనమైంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కి 88 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
నారాయణ హృదయాలయ- బై రూ. 2054, స్టాప్ లాస్ రూ. 1953, టార్గెట్ రూ. 2200
రికో ఆటో ఇండస్ట్రీస్- బై రూ. 146, స్టాప్ లాస్ రూ. 139, టార్గెట్ రూ. 155
అప్కోటెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 585, స్టాప్ లాస్ రూ. 555, టార్గెట్ రూ. 635
360 వన్ వామ్- బై రూ. 1133, స్టాప్ లాస్ రూ. 1089, టార్గెట్ రూ. 1222
మనోరమ ఇండస్ట్రీస్- బై రూ. 1659, స్టాప్ లాస్ రూ. 1585, టార్గెట్ రూ. 1777
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


