ట్రేడర్స్ అలర్ట్! ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్తో లాభాలకు ఛాన్స్..
డిసెంబర్ 22, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 448 పాయింట్లు పెరిగి 84,930 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 151 పాయింట్లు వృద్ధిచెంది 25,966 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 59,069 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,830.89 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,722.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 19,857.37 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 52,032.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
నిఫ్టీ50 కీలక దశలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ దిశ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. కీలక రెసిస్టెన్స్ దాటేందుకు సూచీ కష్టపడుతుండటంతో షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు.
“నిఫ్టీ50 20 డీఈఎంఏ, 50 డీఈఎంఏ, 200 డీఈఎంఏ ఎగువన ట్రేడ్ అవుతోంది. ఇది బుల్లిష్ స్ట్రక్చర్కి సంకేతం. మరోవైపు 26000 కీలక రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత 26,200 కూడా రెసిస్టెన్స్గా ఉంది. 25,900- 25,800- 25,700 లెవల్స్ సపోర్ట్ ఉన్నాయి. ఇవి బ్రేక్ అయితే సూచీలో సెల్లింగ్ ప్రెజర్ కనిపించవచచు,” అని చాయిస్ బ్రోకింగ్ సంస్థకు చెందిన రీసెర్చ్ ఎనలిస్ట్ హితేశ్ టైలర్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.9 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.3 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కోరమాండల్ ఇంటర్నేషనల్: రూ .2425 వద్ద కొనండి, లక్ష్యం రూ .2626, స్టాప్ లాస్ రూ .2323;
లుమాక్స్ ఆటోటెక్నాలజీస్: రూ .1545 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .1650, స్టాప్ లాస్ రూ .1495;
హెక్సావేర్ టెక్నాలజీస్: రూ .791 వద్ద కొనండి, లక్ష్యం రూ .850, స్టాప్ లాస్ రూ .760;
స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్: రూ .930 వద్ద కొనండి, రూ .1000 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .895;
సాయి లైఫ్ సైన్సెస్: రూ .917 వద్ద కొనండి, లక్ష్యం రూ .985, స్టాప్ లాస్ రూ .888.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


