ట్రేడర్స్ అలర్ట్- SBI స్టాక్కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంతంటే..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 84,779 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 171 పాయింట్లు వృద్ధిచెంది 25,966 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 415 పాయింట్లు పెరిగి 58,114 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 55.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,492.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 299.6 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 36,481.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,700 వద్ద సపోర్ట్ ఉంది. 26,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 26,500 వరకు వెళ్లొచ్చు. కానీ 25,700 దిగువకు పడిపోతే నెగిటివ్ ట్రెండ్ ప్రారంభం అవ్వొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.71 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.23శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.8 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
లారస్ ల్యాబ్స్- బై రూ. 940, స్టాప్ లాస్ రూ. 907, టార్గెట్ రూ. 1006
ఎస్బీఐ- బై రూ. 923, స్టాప్ లాస్ రూ. 890, టార్గెట్ రూ. 990
కేఫిన్ టెక్నాలజీస్- బై రూ. 1168, స్టాప్ లాస్ రూ. 1145, టార్గెట్ రూ. 1200
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1378, స్టాప్ లాస్ రూ. 1350, టార్గెట్ రూ. 1430
నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా- బై రూ. 3895, స్టాప్ లాస్ రూ. 3810, టార్గెట్ 4070.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
భారత్ సీట్స్: రూ.225, టార్గెట్ రూ.240, స్టాప్ లాస్ రూ.217;
జోటా హెల్త్ కేర్: రూ.1571 వద్ద కొనండి, టార్గెట్ రూ.1690, స్టాప్ లాస్ రూ.1520;
ప్రెసిషన్ వైర్స్ ఇండియా: రూ .210.7 వద్ద కొనండి, టార్గెట్ రూ .225, స్టాప్ లాస్ రూ .203;
కార్ట్రేడ్ టెక్: రూ .2665 వద్ద కొనండి, లక్ష్యం రూ .2865, స్టాప్ లాస్ రూ .2570;
పరాగ్ మిల్క్ ఫుడ్స్: రూ.317 వద్ద కొనండి, టార్గెట్ రూ.340, స్టాప్ లాస్ రూ.305.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












