ట్రేడర్స్​ అలర్ట్​- SBI స్టాక్​కి టైమ్​ వచ్చింది! షేర్ ప్రైజ్​ టార్గెట్​ ఎంతంటే..​

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 28, 2025 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 567 పాయింట్లు పెరిగి 84,779 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 171 పాయింట్లు వృద్ధిచెంది 25,966 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 415 పాయింట్లు పెరిగి 58,114 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 55.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,492.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ అక్టోబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 299.6 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 36,481.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 25,700 వద్ద సపోర్ట్​ ఉంది. 26,000 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే సూచీ 26,500 వరకు వెళ్లొచ్చు. కానీ 25,700 దిగువకు పడిపోతే నెగిటివ్​ ట్రెండ్​ ప్రారంభం అవ్వొచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.71 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.23శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.8 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

లారస్​ ల్యాబ్స్​- బై రూ. 940, స్టాప్​ లాస్​ రూ. 907, టార్గెట్​ రూ. 1006

ఎస్బీఐ- బై రూ. 923, స్టాప్​ లాస్​ రూ. 890, టార్గెట్​ రూ. 990

కేఫిన్​ టెక్నాలజీస్​- బై రూ. 1168, స్టాప్​ లాస్​ రూ. 1145, టార్గెట్​ రూ. 1200

ఐసీఐసీఐ బ్యాంక్​- బై రూ. 1378, స్టాప్​ లాస్​ రూ. 1350, టార్గెట్​ రూ. 1430

నెట్​వెబ్​ టెక్నాలజీస్​ ఇండియా- బై రూ. 3895, స్టాప్​ లాస్​ రూ. 3810, టార్గెట్​ 4070.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

భారత్ సీట్స్: రూ.225, టార్గెట్ రూ.240, స్టాప్ లాస్ రూ.217;

జోటా హెల్త్ కేర్: రూ.1571 వద్ద కొనండి, టార్గెట్ రూ.1690, స్టాప్ లాస్ రూ.1520;

ప్రెసిషన్ వైర్స్ ఇండియా: రూ .210.7 వద్ద కొనండి, టార్గెట్ రూ .225, స్టాప్ లాస్ రూ .203;

కార్ట్రేడ్ టెక్: రూ .2665 వద్ద కొనండి, లక్ష్యం రూ .2865, స్టాప్ లాస్ రూ .2570;

పరాగ్ మిల్క్ ఫుడ్స్: రూ.317 వద్ద కొనండి, టార్గెట్ రూ.340, స్టాప్ లాస్ రూ.305.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More