Stock Market : యూఎస్​- ఇరాన్ చర్చలు విఫలం! చమురు ధర జంప్, స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

Stock market updates : మే 11, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 11, 2026, 08:14:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sensex today : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 516 పాయింట్లు పడి 77,328 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 150 పాయింట్లు కోల్పోయి 24,176 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 737 పాయింట్లు పడి 55,311 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

కాగా.. యుద్ధం ముగింపు, చమురు సరఫరా పునరుద్ధరణ కోసం ఇరాన్- అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలం అయ్యాయన్న వార్తలు తాజాగా కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధర భారీగా పెరిగింది. స్టాక్​ మార్కెట్​లో అనిశ్చితి నెలకొంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,110.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,748.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 142 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 50ఈఎంఐ జోన్ అయిన 24,200 వద్ద కదులుతోంది. 23,800 కీలక సపోర్ట్​గా ఉంది. 24,200 లెవల్ దాటితే సూచీ మరింత పెరగొచ్చు,” అని ప్రభుదాస్ లిల్లాధేర్​ వైస్​ ప్రెసిడెంట్​ వైశాలీ పరేఖ్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.02 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.84శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.7 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విచ్ఛిన్నం అవ్వడంతో బ్రెంట్​ క్రూడ్​ ఒక్కసారిగా 3.14శాతం పెరిగి బ్యారెల్​కు 104.47 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

మారెపెన్ ల్యాబ్స్- బై రూ. 45.70, స్టాప్​ లాస్​ రూ. 44, టార్గెట్​ రూ. 48

రిలయన్స్​- బై రూ. 1340, స్టాప్​ లాస్​ రూ. 1325, టార్గెట్​ రూ. 1380

ఏయూ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్- బై రూ. 1050, స్టాప్​ లాస్​ రూ. 1035, టార్గెట్​ రూ. 1070

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఏషియన్ పెయింట్స్​- బై రూ. 2599.90, స్టాప్​ లాస్​ రూ. 2490, టార్గెట్​ రూ. 2800

కెన్స్ టెక్నాలజీ ఇండియా- బై రూ. 4507.50, స్టాప్​ లాస్​ రూ. 4300, టార్గెట్​ రూ. 4900

టాటా కన్జ్యూమర్ ప్రాడక్ట్స్- బై రూ. 1176.20, స్టాప్​ లాస్​ రూ. 1125, టార్గెట్​ రూ. 1275

వీఎస్​టీ ఇండస్ట్రీస్- బై రూ. 264.40, స్టాప్​ లాస్​ రూ. 252, టార్గెట్​ రూ. 285

రాడికో ఖైతాన్- బై రూ. 3477.2, స్టాప్​ లాస్​ రూ. 3320, టార్గెట్​ రూ. 2800

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More