Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ 8 స్టాక్స్తో ఈరోజు లాభాలకు ఛాన్స్!
మార్చ్ 18, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 568 పాయింట్లు పెరిగి 76,071 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 172 పాయింట్లు వృద్ధిచెంది 23,581 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 463 పాయింట్లు పెరిగి 54,876 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,741.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,225.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,350- 23,300 కీలక సపోర్ట్ జోన్గా ఉంది. పుల్ బ్యాక్ అయితే సూచీ 23,800కి, అక్కడి నుంచి 23,950 వరకు వెళ్లొచ్చు,” అని కొటాక్ సెక్యూరిటీస్ వెల్లడించింది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.10 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.25శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.4 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ 1.1శాతం పడి బ్యారెల్కి 102.27కి చేరింది.
స్టాక్స్ టు బై..
వర్ధమాన్ టెక్స్టైల్స్- బై రూ. 554, స్టాప్ లాస్ రూ. 535, టార్గెట్ రూ. 592
చంబల్ ఫర్టిలైజర్స్- బై రూ. 429, స్టాప్ లాస్ రూ. 414, టార్గెట్ రూ. 460
ఏషియన్ పెయింట్స్- బై రూ. 2328, స్టాప్ లాస్ రూ. 2280, టార్గెట్ రూ. 2380
పవర్ గ్రిడ్ కార్పొరేషన్- బై రూ. 298, స్టాప్ లాస్ రూ. 293, టార్గెట్ రూ. 312
ఔరబిందో ఫార్మా- బై రూ. 1285, స్టాప్ లాస్ రూ. 1260, టార్గెట్ రూ. 1330
టీడీ పవర్ సిస్టెమ్స్- బై రూ. 817, స్టాప్ లాస్ రూ. 800, టార్గెట్ రూ. 855
బీఎస్ఈ- బై రూ. 2973, స్టాప్ లాస్ రూ. 2915, టార్గెట్ రూ. 3120
నెట్వెబ్ టెక్నాలజీస్- బై రూ. 3304, స్టాప్ లాస్ రూ. 3240, టార్గెట్ రూ. 3450
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


