Stock market news : చమురు ధర మళ్లీ జంప్- ఈ రోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
Stock market updates : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 852 పాయింట్లు పడి 77,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 205 పాయింట్లు కోల్పోయి 24,173 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 819 పాయింట్లు పడి 56,305 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,255 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 941 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్గా చూసుకుంటే నిఫ్టీ50కి 23,950- 24,000 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,350- 24,400 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని చాయిస్ బ్రోకింగ్కి చెందిన సుమిత్ బగాడియా వివరించారు.
కాగా అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బిగినర్లు ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.37 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.41శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.89 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధర విపరీతంగా పెరుగుతోంది. శుక్రవారం సైతం బ్రెంట్ క్రూడ్ ధర 1.17శాతం పెరిగి బ్యారెల్కి 106.3 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
సాయ్ లైఫ్ సైన్సెస్- బై రూ. 1041, స్టాప్ లాస్ రూ. 1000, టార్గెట్ రూ. 1111
బ్లాక్ బాక్స్- బై రూ. 548, స్టాప్ లాస్ రూ. 525, టార్గెట్ రూ. 585
నోసిల్- బై రూ. 182.5, స్టాప్ లాస్ రూ. 174, టార్గెట్ రూ. 195
ప్రివి స్పెషాలిటీ కెమికల్స్- బై రూ. 3250, స్టాప్ లాస్ రూ. 3115, టార్గెట్ రూ. 3450
గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 686, స్టాప్ లాస్ రూ. 665, టార్గెట్ రూ. 725
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


