Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 226 స్టాక్తో లాభాలకు ఛాన్స్!
మార్చ్ 27, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శ్రీరామ నవమి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1205 పాయింట్లు పెరిగి 75,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 394 పాయింట్లు వృద్ధిచెంది 23,306 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1102 పాయింట్లు పెరిగి 53,708 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,805.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,429.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 185 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,400- 23,600 లెవల్స్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే 23,850 వరకు వెళ్లొచ్చు. మరోవైపు 22,500 వద్ద సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.01 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.74శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.3 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల పైనే ఉంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 0.76శాతం పడి బ్యారెల్కు 107.19 డాలర్ల వద్ద ఉంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కర్ణాటక బ్యాంక్- బై రూ. 226.48, స్టాప్ లాస్ రూ. 218, టార్గెట్ రూ. 240
లుమాక్స్ ఆటో టెక్నాలజీస్- బై రూ. 1623, స్టాప్ లాస్ రూ. 1557, టార్గెట్ రూ. 1736
సైర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ- బై రూ. 817, స్టాప్ లాస్ రూ. 777, టార్గెట్ రూ. 880
గ్లెన్మార్క్ ఫార్మా- బై రూ. 2168, స్టాప్ లాస్ రూ. 2078, టార్గెట్ రూ. 2300
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ- బై రూ. 2168, స్టాప్ లాస్ రూ. 2078, టార్గెట్ రూ. 2300
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


