Gavaskar Vaibhav: టీమిండియాపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆటగాళ్లపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన ఇండియన్ టీమ్.. పసికూన ఐర్లాండ్ చేతిలో వరుసగా రెండు టీ20 మ్యాచ్ లు ఓడిపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదంటూ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు.
వైభవ్ సూర్యవంశీ డెబ్యూ

భారత దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న బీహార్కు చెందిన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ అరంగేట్రంపై ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్తో జరుగుతున్న సిరీస్లోనే అతను అరంగేట్రం చేసి, ల్యాండ్మార్క్ సాధిస్తాడని అంతా అనుకున్నారు.
సునీల్ గవాస్కర్ ఫైర్
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత మేనేజ్మెంట్ ప్రస్తుతానికి సీనియర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ల వైపే మొగ్గు చూపింది. దీంతో ఐర్లాండ్ తో సిరీస్ లో వైభవ్ డెబ్యూ చేయలేదు. ఈ సిరీస్ ను ఇండియా కోల్పోయింది. దీంతో ఈ సిరీస్ లో వైభవ్ ను ఎందుకు ఆడించలేదని టీమ్ మేనేజ్ మెంట్ ను సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు.
ఐర్లాండ్ లో ఆడిస్తారనుకున్నా
‘ఇండియా టుడే’తో గవాస్కర్ మాట్లాడుతూ.. "ఐర్లాండ్ను పెద్ద ముప్పుగా భావించకుండా యువ ఆటగాడు సూర్యవంశీకి తొలి మ్యాచ్లోనే అవకాశం ఇస్తారని నేను నిజంగా అనుకున్నా. అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి, వైభవ్ను ఓపెనర్గా బరిలోకి దింపాల్సింది.
ఇంగ్లాండ్ వంటి కఠినమైన పర్యటనకు ముందు ఒక యువకుడిని అంతర్జాతీయ క్రికెట్కు పరిచయం చేయడానికి ఇది చాలా మంచి మార్గం. కానీ ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు" అని సునీల్ గవాస్కర్ తెలిపాడు.
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
{{/usCountry}}ఇంగ్లాండ్ వంటి కఠినమైన పర్యటనకు ముందు ఒక యువకుడిని అంతర్జాతీయ క్రికెట్కు పరిచయం చేయడానికి ఇది చాలా మంచి మార్గం. కానీ ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు" అని సునీల్ గవాస్కర్ తెలిపాడు.
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
{{/usCountry}}ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ 700కు పైగా పరుగులు చేసి అద్భుత ఫామ్తో జాతీయ జట్టు పిలుపు అందుకున్నాడు. అంతేకాకుండా, శ్రీలంకతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో కేవలం 11 బంతుల్లోనే లిస్ట్-ఎ (List-A) క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
నమ్మశక్యం కాని విషయం
"లిస్ట్-ఎ క్రికెట్లో కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును అందుకోవడం అనేది నమ్మశక్యం కాని విషయం. ఇవి చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్లు. అందుకే అతని చుట్టూ ఇంత అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో సిరీస్లో వైభవ్ ఓపెనర్గా రావడం ఖాయం. అతని ఆడించి తప్పు సరిదిద్దుకోవాలి’’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
సచిన్ 37 ఏళ్ల రికార్డు బద్దలవుతుందా?
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో (16 ఏళ్ల 205 రోజులు) అంతర్జాతీయ క్రికెట్ (టెస్ట్) లో అరంగేట్రం చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసులోనే ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ సిరీస్లో బరిలోకి దిగితే, సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలవ్వడం ఖాయం.