ఆన్లైన్లో బాలల లైంగిక వేధింపులు, అబ్యూజ్ మెటీరియల్ (CSEAM) వ్యాప్తిని అడ్డుకోవడంలో సోషల్ మీడియా సంస్థలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో సామాజిక మాధ్యమాలు విఫలమవుతుండటంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

నెట్వర్క్ దిగ్గజాలు తమ వేదికలపై జరిగే బాలల లైంగిక నేరాల సమాచారాన్ని భారతీయ చట్ట అమలు సంస్థలకు నివేదించడం లేదని, అలాగే నేరస్థుల వివరాలను 'నేషనల్ డేటాబేస్ ఆఫ్ సెక్సువల్ అఫెండర్స్' (NDSO)లో తక్షణమే అప్లోడ్ చేయడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీవ్రమైన అంశంపై విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY), న్యాయ మంత్రిత్వ శాఖలకు నోటీసులు ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాలల హక్కుల కోసం పనిచేస్తున్న 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలియన్స్' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన కోర్టు, ఈ రెండు మంత్రిత్వ శాఖలను ప్రతివాదులుగా చేర్చేందుకు అనుమతించింది. సెప్టెంబరు 24 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, అంతకంటే రెండు వారాల ముందే పిటిషనర్లకు దాని ప్రతులను అందించాలని స్పష్టం చేసింది.
పెయిడ్ యాడ్స్.. ఇతర సైట్లకు రీడైరెక్ట్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్ను ప్రోత్సహించే విధంగా పెయిడ్ ప్రకటనలు ఇస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను ఇతర వెబ్సైట్లు లేదా యాప్లకు రీడైరెక్ట్ చేసి, డబ్బులు వసూలు చేస్తూ లైంగిక కంటెంట్ను విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అడ్వర్టైజ్మెంట్ స్క్రీనింగ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్పై స్పందించిన ధర్మాసనం, ఇది ఎంతో తీవ్రమైన విషయమని పేర్కొంది. ఆన్లైన్ వేదికల్లో పిల్లల రక్షణకు సంబంధించిన ఈ అంశంపై సమగ్రంగా, లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
పోక్సో చట్టం తప్పనిసరి: పాత తీర్పును గుర్తుచేసిన బెంచ్
{{/usCountry}}ఈ పిటిషన్పై స్పందించిన ధర్మాసనం, ఇది ఎంతో తీవ్రమైన విషయమని పేర్కొంది. ఆన్లైన్ వేదికల్లో పిల్లల రక్షణకు సంబంధించిన ఈ అంశంపై సమగ్రంగా, లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
పోక్సో చట్టం తప్పనిసరి: పాత తీర్పును గుర్తుచేసిన బెంచ్
{{/usCountry}}"సమాచార సాంకేతికత (IT) చట్టంలోని సెక్షన్ 79 కింద లభించే 'సేఫ్-హార్బర్' మినహాయింపులు సోషల్ మీడియా వేదికలకు ఊరికే రావు. ఐటీ నిబంధనలతో పాటు పోక్సో (POCSO) చట్టంలోని నిర్బంధ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ఆ చట్టపరమైన రక్షణ వర్తిస్తుంది" అని 2024 సెప్టెంబరు 23న తాము ఇచ్చిన కీలక తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సోషల్ మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, డిజిటల్ ప్లాట్ఫామ్లలో పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.