8వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్లైన్ నుంచి పీడీఎఫ్ కాపీలను వెంటనే తొలగించాలని కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
న్యాయవ్యవస్థ రక్తం ఓడుతోంది - సీజేఐ సూర్యకాంత్

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా పాఠ్యపుస్తకాల్లో కంటెంట్ను పొందుపరచడంపై సుప్రీంకోర్టు అత్యంత కఠినంగా స్పందించింది. 8వ తరగతి ఎన్సీఈఆర్టీ సోషల్ సైన్స్ పుస్తకంలో "న్యాయవ్యవస్థలో అవినీతి" (Corruption in Judiciary) అనే సబ్-చాప్టర్పై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.
"వారు తుపాకీతో కాల్చారు, నేడు న్యాయవ్యవస్థ రక్తం ఓడుతోంది. ఈ రోజు ఎవరైనా ఏదైనా చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఇది చాలా పక్కాగా జరిగిన కుట్రగా కనిపిస్తోంది. భారత న్యాయవ్యవస్థను అవినీతిమయంగా చూపిస్తూ పిల్లలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?" అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
ఎవరెవరికి నోటీసులు?
ఈ వివాదాస్పద పాఠాన్ని రూపొందించిన వారిని గుర్తించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఆన్లైన్ కాపీల తొలగింపునకు ఆదేశం
ఈ పుస్తకానికి సంబంధించి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అన్ని పీడీఎఫ్ (PDF) కాపీలను తక్షణమే తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. దీనిపై స్పందించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అండగా ఉంటుందని, కోర్టు కోరిన విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆ రచయితలు ఎవరు?
ఈ పాఠాన్ని రూపొందించిన 'టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీ' వివరాలను రికార్డుల్లో ఉంచాలని ఎన్సీఈఆర్టీని కోర్టు ఆదేశించింది. సదరు చాప్టర్ డెవలప్మెంట్ టీమ్లో ఉన్న సభ్యుల పేర్లు, వారి విద్యార్హతలు, వారి పూర్వాపరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్సీఈఆర్టీ క్షమాపణలు చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణను కొనసాగిస్తోంది.
{{/usCountry}}ఈ పాఠాన్ని రూపొందించిన 'టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీ' వివరాలను రికార్డుల్లో ఉంచాలని ఎన్సీఈఆర్టీని కోర్టు ఆదేశించింది. సదరు చాప్టర్ డెవలప్మెంట్ టీమ్లో ఉన్న సభ్యుల పేర్లు, వారి విద్యార్హతలు, వారి పూర్వాపరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్సీఈఆర్టీ క్షమాపణలు చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణను కొనసాగిస్తోంది.
{{/usCountry}}"ఈ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమించినా లేదా పక్కదారి పట్టించాలని చూసినా, దానిని నేరుగా న్యాయవ్యవస్థ పాలనలో జోక్యంగా భావిస్తాం. అటువంటి వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయి" అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. అసలు ఈ వివాదం ఏమిటి?
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో 'మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర' అనే పాఠంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే అంశాన్ని చేర్చారు. దీనిపై న్యాయవర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
2. సుప్రీంకోర్టు తీసుకున్న ప్రధాన చర్యలేమిటి?
సదరు పుస్తకంపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ఇంటర్నెట్ నుంచి డిజిటల్ కాపీలను తొలగించాలని ఆదేశించింది. దీని వెనుక ఉన్న రచయితల వివరాలను కోరింది.
3. ప్రభుత్వం దీనిపై ఏమంటోంది?
న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోర్టు ఆదేశాల మేరకు తక్షణమే వెబ్సైట్ల నుంచి ఆ కంటెంట్ను తొలగిస్తామని కేంద్రం తెలిపింది.