...
...
Next Story

సుజ్లాన్ ఎనర్జీ షేరు బేజార్: 52 వారాల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనవచ్చా?

మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, విండ్ ఎనర్జీ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ షేరు సోమవారం 52 వారాల కనిష్ట స్థాయి ₹43.85కి పడిపోయింది. గత ఏడాది మే నెలలో ఉన్న గరిష్ట స్థాయి ₹74.30 నుండి ఇది దాదాపు 41% పతనమైంది. అయితే, కంపెనీ ఆర్డర్ బుక్ బలంగా ఉండటంతో బ్రోకరేజ్ సంస్థలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.

Published on: Feb 23, 2026, 13:46:11 IST
Advertisement

స్టాక్ మార్కెట్‌లో ఒకప్పుడు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. నిఫ్టీ, సెన్సెక్స్ వంటి బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ఉన్నప్పటికీ, ఈ షేరు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనై సోమవారం (ఫిబ్రవరి 23, 2026) నాడు ఏడాది కనిష్టానికి చేరింది. సోమవారం రూ. 43.85 వద్ద ట్రేడైంది. 2025 మే నెలలో గరిష్టంగా రూ. 74.30 వద్ద ట్రేడైంది. గడిచిన 3 నెలల కాలంలో 20 శాతం నష్టపోయింది. అయితే గడిచిన 5 ఏళ్లలో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 816 శాతం లాభాలు ఇచ్చింది.

కంపెనీ ఫలితాలు బాగున్నా షేరు ఎందుకు పడుతోంది?

సుజ్లాన్ ఎనర్జీ షేరు బేజార్: 52 వారాల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనవచ్చా?
సుజ్లాన్ ఎనర్జీ షేరు బేజార్: 52 వారాల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనవచ్చా?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో (Q3) కంపెనీ పనితీరు ఇలా ఉంది.

  • నికర లాభం: 445 కోట్లు (గతేడాది కంటే 15% వృద్ధి).
  • ఆదాయం: 4,228 కోట్లు (గతేడాది 2,969 కోట్లు).
  • ఆర్డర్ బుక్: 6.4 GW (గత 30 ఏళ్లలో ఇదే అత్యధికం).
  • నిర్వహణ మార్జిన్లు: 17.5% కి పెరిగాయి.

ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ సవాళ్లు (ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం) ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. ఆర్డర్లు వస్తున్నా, వాటిని కమిషన్ చేయడంలో జాప్యం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారు? కొనవచ్చా?

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నప్పటికీ, తమ లక్ష్య ధరలను (Target Prices) తగ్గించాయి.

  • JM ఫైనాన్షియల్: ఈ స్టాక్‌కు 'Buy' రేటింగ్ ఇచ్చింది. లక్ష్య ధరను 64గా నిర్ణయించింది. అయితే, డెలివరీ అంచనాలను స్వల్పంగా తగ్గించింది.
  • నువామా (Nuvama): ఇది కూడా 'Buy' కాల్ ఇచ్చింది, కానీ టార్గెట్ ధరను 60 నుండి 55కి తగ్గించింది. విండ్ ఎనర్జీ రంగంలో సుజ్లాన్ కీలక పాత్ర పోషిస్తుందని, అయితే పోటీ పెరుగుతోందని హెచ్చరించింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe